తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా..

|

May 31, 2020 | 2:00 PM

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని.. నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా విధించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్న క్రమంలో భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్కులను తప్పనిసరిగా ధరించేలా గ్రామాల్లో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు.  కరోనా మహమ్మారి గ్రామాల […]

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా..
Follow us on

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని.. నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా విధించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్న క్రమంలో భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్కులను తప్పనిసరిగా ధరించేలా గ్రామాల్లో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు.  కరోనా మహమ్మారి గ్రామాల దరి చేరకుండా.. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేలా ఎప్పటికప్పుడు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. అంతేకాక పల్లెప్రగతి స్ఫూర్తితో జూన్ 1 నుంచి జూన్ 8వ తేదీ వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి దయాకర్‌రావు వెల్లడించారు.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని మంత్రి స్పష్టం చేశారు. తొలి రోజులో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహిస్తారని.. ఆ సమయంలో నీరు నిలిచిన గుంతలన్నింటిని మూసివేస్తారన్నారు. కాగా, రక్షిత నీటి పధకాలను ప్రతీ నెల 1, 11, 21వ తేదీల్లో శుభ్రపరిచి.. లీకేజీలు లేకుండా చూసుకోవాలని మంత్రి దయాకర్‌రావు తెలిపారు.

Also Read: గుడ్ న్యూస్.. పాస్‌లు లేకుండానే అంతర్రాష్ట్ర ప్రయాణాలు.. కానీ!