ఒక వైపు కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా.. మృగాళ్లు మాత్రం మారడం లేదు. నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వస్తున్నా, నిందితులను ఎంతో కఠినంగా శిక్షిస్తున్నా.. వారిలో మార్పులు రావడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మృగాలు రెచ్చిపోతున్నారు. కరోనా వ్యాప్తి చేయకుండా లాక్డౌన్ విధిస్తే.. కీచకులకు మాత్రం అదే వరంలా మారుతోంది. లాక్డౌన్ సమయంలోనూ మహిళలపై, బాలికలపై గృహ హింస, అత్యాచారం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా 11 ఏళ్ల బాలికపై ఓ 50 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం దర్శి మండలం కోర్లమడుగులో చోటుచేసుకుంది. కాగా.. అత్యాచారం చేసి అనంతరం నిందితుడు పారిపోయాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More:
రికార్డు సృష్టించిన బంగారం.. రూ. 47 వేలకు చేరువ
లాక్డౌన్: నడి రోడ్డుపైనే ప్రసవించిన మహిళ
హైదరాబాద్లో కరోనా పేషెంట్ అరెస్ట్.. దేశంలోనే ఫస్ట్ టైమ్