AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాపిడ్ యాంటిజెన్ టెస్టులు..ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

కోవిడ్ నివారణకు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అదేపనిగా ప్రజలకు రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయించడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది.  ఈ టెస్టులు చాలావరకు తప్పుడు నెగెటివ్ ఫలితాలను చూపుతున్నాయని..

రాపిడ్ యాంటిజెన్ టెస్టులు..ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 28, 2020 | 3:20 PM

Share

కోవిడ్ నివారణకు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అదేపనిగా ప్రజలకు రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయించడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది.  ఈ టెస్టులు చాలావరకు తప్పుడు నెగెటివ్ ఫలితాలను చూపుతున్నాయని.. అసలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐ సీ ఎంఆర్) జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను ఖఛ్చితంగా ఎందుకు పాటించడంలేదని ప్రశ్నించింది. రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయాలని ఆ సంస్థ సూచించలేదని న్యాయమూర్తులు హిమా కోహ్లీ, సుబ్రహ్మణ్య ప్రసాద్ లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. సొంత ప్రయోగాలకు పోకండని వారు హెచ్ఛరించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే ఆర్ టీ, పీసీ ఆర్ టెస్టులు చేయాలని ఐసీ ఎం ఆర్ సూచించిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

అసలు తమకు ఇన్ఫెక్షన్ సోకిందా, లేదా అన్న విషయం కూడా తెలియకుండా 22.86 శాతం జనాభా రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయించుకున్నారని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిర్వహించిన ‘సీరో సర్వే’ లో తేలిందని కోర్టు పేర్కొంది. ఈ రకంగా టెస్టింగ్ చేయాలని ఐ సీ ఎం ఆర్ సూచించిందా అని జడ్జీలు ప్రశ్నించారు. అలాగే కోవిడ్ టెస్టింగ్ చేయించుకోగోరేవారు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై కూడా కోర్టు మండిపడింది.