దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లక్షా 58 వేల మార్క్ దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్లో వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 158333
దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86110
కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 67692
దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4531
ఇదిలా ఉంటే దేశంలో 35 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించిన ఈ మహమ్మారి తీవ్రత 10 రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో దాదాపు 87% కేసులు నమోదయ్యాయి. ఇక మరో 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 9 శాతానికి పైగా కేసులు నమోదవ్వగా.. మిగిలిన 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 0.47% కేసులు వెలుగు చూశాయి. కాగా, 2.64% మంది బాధితులను పలు రాష్ట్రాలు వారివారి స్వస్థలాలకు పంపించడంతో వారిని ప్రస్తుతానికి ఏ రాష్ట్రాల జాబితాలోనూ చేర్చలేదు.
Read More:
తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..
CBSE విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాల నుంచే పరీక్షలు..
ఆన్లైన్ ద్వారా పీఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోండిలా..!
విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయుధం.. సీఎం జగన్ కొత్త వెబ్సైట్..