ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 210 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2,108,445 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 7959 మంది చనిపోవడంతో ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందన్నది తెలుస్తోంది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 137,036 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 526,700 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. అగ్రరాజ్యం అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇరాన్, బ్రిటన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక కేసులు(645,575), మరణాలు(28,623) అమెరికాలోనే నమోదయ్యాయి. కాగా, ఇండియాలో ఇప్పటివరకు 12759 కేసులు నమోదు కాగా.. 420 మృతి చెందారు.
కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల లిస్ట్…
Also Read:
ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..
అక్షయ్ రూ.25 కోట్లు విరాళం ఇవ్వడం పెద్ద తప్పు.. శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు..
చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్ను వేడుకోలు..
కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఈ-పాస్గా ‘ఆరోగ్య సేతు’ యాప్..
‘ఇంట్లో మద్యం తయారు చేయడం ఎలా.?’ గూగుల్లో ట్రెండ్ సెట్ చేసిన మందుబాబులు…
‘వైకుంఠపురంలో’.. అలా తమిళంలో..