ఐపీఎల్ కోసం ఆసియా కప్ రద్దు చేస్తే ఊరుకోం: పాక్ బోర్డు
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మనుగడకు భారత్ అవసరం లేదని చెప్పిన కొన్ని గంటల్లోనే ఆ దేశ బోర్డు చైర్మన్ ఎహ్సన్ మరోసారి ఇండియాపై నిప్పులు చెరిగాడు. ఐపీఎల్ కోసం ఆసియా కప్ను రద్దు చేస్తే ఊరుకునేది లేదని వెల్లడించాడు. వాస్తవానికి మార్చి 29న ఐపీఎల్ మొదలు కావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా అది కాస్తా నిరవధిక వాయిదా పడింది. దీనితో సెకండ్ ఛాయస్ కింద సెప్టెంబర్- అక్టోబర్ విండోలో ఈ లీగ్ను నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు […]
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మనుగడకు భారత్ అవసరం లేదని చెప్పిన కొన్ని గంటల్లోనే ఆ దేశ బోర్డు చైర్మన్ ఎహ్సన్ మరోసారి ఇండియాపై నిప్పులు చెరిగాడు. ఐపీఎల్ కోసం ఆసియా కప్ను రద్దు చేస్తే ఊరుకునేది లేదని వెల్లడించాడు. వాస్తవానికి మార్చి 29న ఐపీఎల్ మొదలు కావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా అది కాస్తా నిరవధిక వాయిదా పడింది. దీనితో సెకండ్ ఛాయస్ కింద సెప్టెంబర్- అక్టోబర్ విండోలో ఈ లీగ్ను నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు పలు వార్తలు కూడా వచ్చాయి. అయితే నిజానికి సెప్టెంబర్లో దుబాయ్ వేదికగా ఆసియా కప్కు పాక్ ఆతిద్యం ఇవ్వనుంది. దీనితో ఐపీఎల్ కోసం ఈ టోర్నీని వాయిదా వేయమని ఎహ్సన్ తేల్చి చెప్పాడు.
‘సెప్టెంబర్లో ఐపీఎల్ నిర్వహిస్తారని వస్తోన్న వార్తలు గురించి విన్నాను. ఆసియా కప్ నిర్వహణపై కేవలం భారత్, పాక్ దేశాలు నిర్ణయం తీసుకుంటే సరిపోదు. అంతేకాక ఆ సమయంలో ఆసియా కప్ నిర్వహణ ఎంతో ముఖ్యమైనది. ఈ టోర్నీ ద్వారా వచ్చే నిదులపైనే ఆసియా క్రికెట్ అభివృద్ధి ఆధారపడి ఉంది. అటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్య దేశాల క్రికెట్ అభివృద్ధికి కూడా ఈ నిధులు ఎంతో అవసరం. మరోవైపు ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కూడా జరగకపోతే దేశాలు ఆర్ధికంగా నష్టపోతాయి. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నమెంట్ వాయిదా పడితే.. దాని నుంచి రావాల్సిన నిధులు అందక పాకిస్తాన్తో సహా మిగతా దేశాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడతాయని ఎహ్సన్ అన్నారు.
Also Read:
ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..
అక్షయ్ రూ.25 కోట్లు విరాళం ఇవ్వడం పెద్ద తప్పు.. శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు..
చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్ను వేడుకోలు..
కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఈ-పాస్గా ‘ఆరోగ్య సేతు’ యాప్..
‘ఇంట్లో మద్యం తయారు చేయడం ఎలా.?’ గూగుల్లో ట్రెండ్ సెట్ చేసిన మందుబాబులు…