దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఆ 6 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు…

|

May 13, 2020 | 10:47 AM

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా 74,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 3,525 కరోనా కేసులు కొత్తగా నమోదు కాగా.. ఈ మహమ్మారి బారినపడి 122 మంది చనిపోయారు. ప్రస్తుతం 47,480 యాక్టివ్ కేసులు ఉండగా.. 24, 386 మంది వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 2,415 మంది మృత్యువాతపడ్డారు. కాగా, దేశంలోని ఐదారు […]

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఆ 6 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు...
Follow us on

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా 74,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 3,525 కరోనా కేసులు కొత్తగా నమోదు కాగా.. ఈ మహమ్మారి బారినపడి 122 మంది చనిపోయారు. ప్రస్తుతం 47,480 యాక్టివ్ కేసులు ఉండగా.. 24, 386 మంది వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 2,415 మంది మృత్యువాతపడ్డారు.

కాగా, దేశంలోని ఐదారు రాష్ట్రాల్లోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతుండగా.. ఆ తర్వాత గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. అటు ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కోవిడ్ 19 ప్రభావం విపరీతంగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 24,427 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 921 మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్‌లో 8903 కేసులు, 537 మరణాలు సంభవించాయి. ఇక తమిళనాడులో 8718 పాజిటివ్ కేసులు నమోదైతే.. వైరస్ కారణంగా 61 మంది చనిపోయారు.

Read This: కిమ్ లైఫ్‌స్టైల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!