కోహ్లీ-అనుష్క స్వీయ నిర్బంధంలో ఉంటూ..అభిమానులకు వీడియో మెసెజ్..

| Edited By:

Mar 20, 2020 | 3:54 PM

ప్రపంచాన్ని ప్రస్తుతం గడగడలాడిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇది ఇప్పుడు మనదేశంలో కూడా తీవ్ర రూపం దాలుస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండటమే మంచిదని.. నలుగురిలో ఉన్నప్పుడు మాస్క్‌లు ధరించడంతో పాటు.. సామాజిక దూరాన్ని పాటించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దంపతులు అభిమానులకు ఓ సందేశాన్ని ఇచ్చారు. విరాట్ కోహ్లీతో కలిసి అతని […]

కోహ్లీ-అనుష్క స్వీయ నిర్బంధంలో ఉంటూ..అభిమానులకు వీడియో మెసెజ్..
Follow us on

ప్రపంచాన్ని ప్రస్తుతం గడగడలాడిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇది ఇప్పుడు మనదేశంలో కూడా తీవ్ర రూపం దాలుస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండటమే మంచిదని.. నలుగురిలో ఉన్నప్పుడు మాస్క్‌లు ధరించడంతో పాటు.. సామాజిక దూరాన్ని పాటించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దంపతులు అభిమానులకు ఓ సందేశాన్ని ఇచ్చారు. విరాట్ కోహ్లీతో కలిసి అతని భార్య అనుష్కశర్మ ఓ వీడియో తీసి తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోను కోహ్లీ రీ ట్వీట్ చేస్తూ.. తన అభిమానులకు ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనమంతా విపత్కర పరిస్థులను ఎదుర్కొంటున్నామని.. ఈ కోరోనా వైరస్‌ను ఎదుర్కొవాలంటే.. ప్రజలంతా కలిసికట్టుగా ప్రభుత్వాదేశాలను పాటిస్తూ సహకరించాలని సూచించారు. అందరి క్షేమం కోసం తామిద్దరం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నామని తెలిపారు. అంతేకాద ప్రజలంతా కూడా.. వీలైనంత వరకు స్వీయ నిర్బంధంలో ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని కోరారు. అంతా ఇళ్లలోనే ఉంటూ ఆరోగ్యంగా ఉండి ఈ కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించాలని కోరారు.

కాగా.. దేశంలో కరోనా ప్రభావంతో ఇప్పటికే ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. మరో 200 వందల మందికి పైగా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.