AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైద్యుల నిర్లక్ష్యం.. కోవిడ్ అనుమానితుడు మృతి..!

వైద్యుల నిర్లక్ష్యంతో కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.  బద్వాలీ చౌకీ ప్రాంతానికి చెందిన పాండు చందానే  (60) అనే వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు

వైద్యుల నిర్లక్ష్యం.. కోవిడ్ అనుమానితుడు మృతి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 15, 2020 | 6:31 PM

Share

వైద్యుల నిర్లక్ష్యంతో కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.  బద్వాలీ చౌకీ ప్రాంతానికి చెందిన పాండు చందానే  (60) అనే వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మందులు రాసి ఇంటికి పంపించారు.  ఇక మంగళవారం పాండు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో.. మరోసారి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. అయితే, అంబులెన్స్‌ పంపడానికి ఆ ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. దాంతో కుటుంబ సభ్యులు అతడిని బైక్‌పైనే ఆసుపత్రికి తీసుకెళ్లనుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అంబులెన్స్‌ పంపించి ఉంటే పాండు బతికేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అయితే ఇండోర్‌ నగర మెడికల్ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ ఈ ఆరోపణల్ని తోసిపుచ్చారు. మొదట పాండుని ఓ వ్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారని.. అక్కడి నుంచి బైక్‌పై ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా దురదృష్టవశాత్తూ అతడు మరణించాడని వెల్లడించారు. ఇదిలా ఉంటే మృతుని కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తామని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ పీఎస్ ఠాకూర్‌ చెప్పారు.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్: ఆ రంగంలో 3.8కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం..!

Follow Us
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి