బ్రేకింగ్‌ న్యూస్.. ఏపీలో విజృంభిస్తోన్న కరోనా.. కొత్తగా మరో 80 కేసులు..

| Edited By:

Apr 23, 2020 | 3:33 PM

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎనమిది వందల మార్క్‌ నుంచి తొమ్మిది వందల దిశగా వెళ్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 898కు చేరింది. ఇప్పటి వరకు కరోనాను జయించి 141 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 725 ఉన్నాయన్నారు. ఇక ఇప్పటి […]

బ్రేకింగ్‌ న్యూస్.. ఏపీలో విజృంభిస్తోన్న కరోనా.. కొత్తగా మరో 80 కేసులు..
Follow us on

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎనమిది వందల మార్క్‌ నుంచి తొమ్మిది వందల దిశగా వెళ్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 898కు చేరింది. ఇప్పటి వరకు కరోనాను జయించి 141 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 725 ఉన్నాయన్నారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి మొత్తం 27 మంది మృతిచెందారని.. అందులో గడిచిన 24 గంటల్లో ముగ్గురు మృతిచెందారని తెలిపారు.

 

ఇక జిల్లాల వారీగా కేసుల వివరాలు..

అనంతపురం – 42
చిత్తూరు – 73
తూర్పు గోదావరి – 32
గుంటూరు – 195
కడప – 51
కృష్ణా – 88
కర్నూల్ – 234
నెల్లూరు – 67
ప్రకాశం – 50
విశాఖ – 22
పశ్చిమ గోదావరి – 39