బట్టల వ్యాపారికి కరోనా.. మర్కజ్‌ వెళ్లి వచ్చినట్లు గుర్తింపు..

తమిళనాడులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మర్కజ్‌ సమావేశానికి వెళ్లి వచ్చిన వారికి ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అంతేకాదు వారి ద్వారా కాంటాక్ట్ కేసులు కూడా నమోదవుతున్నాయి. తాజాగా తిరువళ్లూర్‌ జిల్లా కడంబత్తూర్‌ యూనియన్‌ పేరంబాక్కంకు చెందిన ఓ బట్టల వ్యాపారికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అధికారులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను అలర్ట్ చేశారు. సదరు వ్యాపారి.. గత మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్‌ సమావేశం […]

బట్టల వ్యాపారికి కరోనా.. మర్కజ్‌ వెళ్లి వచ్చినట్లు గుర్తింపు..

Edited By:

Updated on: Apr 23, 2020 | 5:00 PM

తమిళనాడులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మర్కజ్‌ సమావేశానికి వెళ్లి వచ్చిన వారికి ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అంతేకాదు వారి ద్వారా కాంటాక్ట్ కేసులు కూడా నమోదవుతున్నాయి. తాజాగా తిరువళ్లూర్‌ జిల్లా కడంబత్తూర్‌ యూనియన్‌ పేరంబాక్కంకు చెందిన ఓ బట్టల వ్యాపారికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అధికారులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను అలర్ట్ చేశారు. సదరు వ్యాపారి.. గత మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్‌ సమావేశం వెళ్లి.. గత నెల 23వ తేదీన తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సదరు బాధితుడిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ అని తేలింది.

కాగా.. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత.. 24 నుంచి 31వ తేదీ వరకు బట్టల షాపును తెరచి వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తెరచిఉన్న సమయంలో ఆ షాపులోకి ఎంత మంది కస్టమర్లు వచ్చారన్నది ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. ఆ ప్రాంతంలోని కాంటాక్ట్ కేసులను ఆరా తీస్తున్నారు. సదరు షాపులోకి వెళ్లిన వారంతా క్వారంటైన్‌లోవుండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.