మే 3 తర్వాత లాక్ డౌన్ 3.0 ఖాయమేనా.?

|

Apr 30, 2020 | 5:56 PM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు ప్రస్తుతం రెండో దశ లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. మొదటిగా కేంద్రం లాక్ డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు విధించగా.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. దాన్ని మే 3 వరకు పొడిగించారు. ఇక ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న చర్యలతో చెప్పకనే తెలుస్తోంది. ఇదిలా ఉంటే లాక్ డౌన్ కారణంగా చాలామంది […]

మే 3 తర్వాత లాక్ డౌన్ 3.0 ఖాయమేనా.?
Follow us on

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు ప్రస్తుతం రెండో దశ లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. మొదటిగా కేంద్రం లాక్ డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు విధించగా.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. దాన్ని మే 3 వరకు పొడిగించారు. ఇక ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న చర్యలతో చెప్పకనే తెలుస్తోంది.

ఇదిలా ఉంటే లాక్ డౌన్ కారణంగా చాలామంది ప్రజలు వేర్వేరు ప్రాంతాల్లో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్ధులు తమ స్వస్థలాలకు దూరంగా ఉండిపోయారు. వీరిని తిరిగి రప్పించాలంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు. మొదట్లో ఎక్కడి వారు.. అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేసినా.. తాజాగా కేంద్రం వారికి ఊరటను కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు తమ స్వస్థలాలకు వెళ్ళొచ్చునని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే వారందరికి పరీక్షలు నిర్వహించిన తర్వాతే ప్రయాణానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు ఇచ్చింది. అంతేకాకుండా స్వస్థలానికి చేరుకున్నా మరోసారి టెస్టులు చేసి క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఇక లాక్ డౌన్ పొడిగింపు తప్పదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన కొద్ది గంటల్లోనే కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో మరోసారి లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్ జోన్లలో కఠినమైన నిబంధనలు అమలు చేసి.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మరిన్ని సడలింపులు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. అటు ప్రజా రవాణా మాత్రం ఇప్పటిలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే పలు రాష్ట్రాల సీఎంలు కూడా లాక్ డౌన్‌ను మరోసారి పొడిగించడమే మేలని ప్రధాని మోదీకి చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి తాజాగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు బట్టి లాక్ డౌన్ పొడిగింపు ఖాయమని భావించవచ్చు.

Read Also:

ఇక నుంచి విమానాల్లోనూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్.!

విజయవాడలో హైటెన్షన్.. నలుగురు వార్డు వాలంటీర్లకు కరోనా..

తెరపైకి మరో కొత్త పేరు.. కిమ్ వారసుడు ఆయనేనట.!