అస్సాంలో కామాఖ్య ఆలయ ఉత్సవాలు రద్దు.. ఎందుకంటే ?
అస్సాంలో మొదటిసారిగా కామాఖ్య ఆలయ ఉత్సవాలను ఈ ఏడాది రద్దు చేశారు. ఈ వేడుకలనే ‘అంబుబాచి మేలా ‘ అని కూడా వ్యవహరిస్తారు. కరోనా నేపథ్యంలో ఈ సారి వీటిని నిర్వహించడంలేదని ఆలయ ప్రధాన అర్చకుడు మోహిత్ శర్మ తెలిపారు. ప్రతి ఏటా జూన్ 22 నుంచి 26 వ తేదీ వరకు జరిగే ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి సుమారు 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఈ ఆలయంలోని దేవత రుతుక్రమ […]
అస్సాంలో మొదటిసారిగా కామాఖ్య ఆలయ ఉత్సవాలను ఈ ఏడాది రద్దు చేశారు. ఈ వేడుకలనే ‘అంబుబాచి మేలా ‘ అని కూడా వ్యవహరిస్తారు. కరోనా నేపథ్యంలో ఈ సారి వీటిని నిర్వహించడంలేదని ఆలయ ప్రధాన అర్చకుడు మోహిత్ శర్మ తెలిపారు. ప్రతి ఏటా జూన్ 22 నుంచి 26 వ తేదీ వరకు జరిగే ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి సుమారు 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఈ ఆలయంలోని దేవత రుతుక్రమ ముగింపు ఉత్సవాలుగా వ్యవహరించే ఈ మేళా లో లక్షలాది తాంత్రికులు కూడా పాల్గొంటారు. గౌహతిలోని ఎత్తయిన నీలాచల్ కొండలపైన ఉందీ ఆలయం. ఒకప్పుడు నరకాసురుడు ఈ గుడిని నిర్మించాడని చెబుతారు. కానీ 1565 నుంచి అందిన రికార్డుల ప్రకారం.. కోచ్ వంశ పాలకుడైన నర నారాయణ్ ఈ ఆలయాన్ని పునర్నినిర్మించాడని కూడా తెలుస్తోంది.