దేశంలో ఫుడ్ డెలివరీకి అమెజాన్ రెడీ

| Edited By: Pardhasaradhi Peri

May 21, 2020 | 5:47 PM

కరోనా మహమ్మారి నేపథ్యంలో స్విగ్గీ, జొమాటో లు తమ సంస్థల్లో పని చేస్తున్న వందలాదిమందికి లే ఆఫ్ లు ప్రకటించాయి. అయితే మందు బాబులకు తీపి కబురును అందిస్తూ ఆల్కహాల్ ని హోమ్ డెలివరీ చేసేందుకు నిర్ణయించాయి.

దేశంలో ఫుడ్ డెలివరీకి అమెజాన్ రెడీ
Follow us on

కరోనా మహమ్మారి నేపథ్యంలో స్విగ్గీ, జొమాటో లు తమ సంస్థల్లో పని చేస్తున్న వందలాదిమందికి లే ఆఫ్ లు ప్రకటించాయి. అయితే మందు బాబులకు తీపి కబురును అందిస్తూ ఆల్కహాల్ ని హోమ్ డెలివరీ చేసేందుకు నిర్ణయించాయి. రెండు నెలల లాక్ డౌన్ కారణంగా దేశంలో పెద్ద ఎత్తున  రెస్టారెంట్లు బిజినెస్ లేక మూతబడిన నేపథ్యంలో ఈ సంస్థలకు సైతం నష్టాలు  తప్పలేదు. అయితే లాక్ డౌన్ ఆంక్షలు చాలావరకు సడలడంతో ఇవి ముఖ్యంగా మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు నడుం కట్టాయి. ఇదే సమయంలో.. అమెజాన్ ఫుడ్ డెలివరీకి శ్రీకారం చుట్టింది. మొదట బెంగుళూరు నగరాన్ని తాము ఇందుకు ఎంపిక చేసుకున్నామని ఈ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేయడంతో లక్షలాది మంది ఫుడ్ డెలివరీ పట్ల విముఖత చూపారు.  హైదరాబాద్ వంటి నగరాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్నప్పుడు ఇలాంటి సంస్థలనుంచి ఫుడ్ డెలివరీని ఆయా ప్రభుత్వాలు నిషేధించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మళ్ళీ సాధారణ స్థాయికి వస్తోంది.  ఆంక్షలు చాలావరకు సడలాయి. దీంతో అమెజాన్ వెంటనే రంగంలోకి దిగింది. ప్రముఖ రెస్టారెంట్ల నుంచి, అత్యున్నత ప్రమాణాలతో తాము ఫుడ్ డెలివరీ చేస్తామని, పైగా ఇందుకోసం ‘హైజీన్ సర్టిఫికేషన్ బార్’ ని ఏర్పాటు చేశామని ఈ సంస్థ ప్రతినిధి వివరించారు. బెంగుళూరుతో మొదలుపెట్టి. క్రమంగా అన్ని నగరాలకు ఈ సౌకర్యాన్ని విస్తరిస్తామన్నారు.