అలా చేసిన వారిపై కేసులు: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు సైతం అప్రమత్తమై.. అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు సైతం అప్రమత్తమై.. అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడారు. కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ఆయన అన్నారు. అందరూ కలిసి కరోనాను తరిమికొడదామని ఆయన పిలుపునిచ్చారు. క్వారంటైన్లో మనల్ని మనం కాపాడుకుందామని సూచించారు. అయితే అమరావతి గ్రామాల్లో కొందరు సమాచారం ఇవ్వకుండా దాక్కున్నారని.. ఆశ్రయం ఇచ్చిన వారిపై కేసుల నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
చుట్టూ ఉన్న సమాజానికి నష్టం చేయొద్దని.. ప్రస్తుత పరిస్థితిని ప్రజలంతా అర్ధం చేసుకోవాలని గౌతమ్ సవాంగ్ కోరారు. ఇదంతా మీ కుటుంబ సభ్యుల కోసమేనని తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పోలీసులకు అందరూ సహకరించి.. వైరస్ వ్యాప్తి చెయిన్ను బ్రేక్ చేద్దామని అన్నారు. ఇంట్లోనే ఉండి, సురక్షితంగా ఉండాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్కు వెళ్లాలని సవాంగ్ అన్నారు.
Read More: కరోనా లాక్డౌన్: లిక్కర్ షాపులు తెరవాలట.. నటుడి అభ్యర్థన