
హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఈ ఏడాదికి యూపీఎస్సీ మొత్తం 933 పోస్టులను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనుంది. ఇందులో 33 పోస్టులు బెంచ్మార్క్ వైకల్యం ఉన్నవారికి రిజర్వు చేశారు. మే 24వ తేదీన ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. పరీక్షా కేంద్రాల్లో ఫేస్ రికగ్నిషన్ ద్వారానే అభ్యర్ధులను అనుమతిస్తారు.
దరఖాస్తుదారులు ఆధార్ కార్డులను గుర్తింపు, కార్డులుగా వినియోగించాలని, దీనివల్ల వెరిఫికేషన్ సులభంగా జరుగుతుందని వెల్లడించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారులను ఎంపిక చేయడానికి UPSC ప్రతి యేట ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ఈ ఏడాది నుంచి పారదర్శకత కోసం అభ్యర్థులు పరీక్షా వేదిక వద్ద తప్పనిసరిగా ముఖ ధృవీకరణ చేయించుకోవాలి. ముఖ ధృవీకరణ/గుర్తింపు ధృవీకరణ తనిఖీ కోసం అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని UPSC నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రామాణీకరణ కోసం అభ్యర్ధులు తమ ఆధార్ కార్డును ID పత్రాలుగా ఉపయోగించాలని యూపీఎస్సీ సూచించింది. అలాగే ప్రస్తుతం ఐఎస్ఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసుల్లో ఉన్నవారు 2026 పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు కాదని కమిషన్ తేల్చి చెప్పింది.
ప్రిలిమినరీ పరీక్ష తర్వాత IAS లేదా IFS కు నియమితులైతే వారు ప్రిలిమ్స్ లో అర్హత సాధించినప్పటికీ మెయిన్స్ దశలో హాజరు కావడానికి అర్హులు కారు. మెయిన్స్ పరీక్షలు ప్రారంభమైన తర్వాత కానీ, ఫలితాలు ప్రకటించే ముందుగానీ, ఎంపికైతే వారు CSE 2026 ఫలితాల ప్రకారం ఏ సర్వీస్/పోస్ట్ కు పరిగణించబడరు. ప్పటికే ఎంపికైన లేదా IPSకి నియమించబడిన అభ్యర్థులు CSE-2026 పరీక్ష ద్వారా మళ్ళీ అదే సేవను ఎంచుకోవడానికి అర్హులు కారు. CSE 2026లో IPS లేదా సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ‘A’ కి కేటాయించబడిన అభ్యర్థులు తదుపరి CSE-2027 పరీక్షకు హాజరు కావడానికి అవకాశం ఉంటుంది. అయితే సంబంధిత అథారిటీ నుంచి ట్రైనింగ్లో చేరడంపై ఒకసారి మినహాయింపు పొందితే, వారు వెంటనే తదుపరి సీఎస్ఈ-2027 పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ప్రిలిమ్స్ ఆన్సర్ కీపై అభ్యంతరాల గడువును కూడా యూపీఎస్సీ ఏడు రోజుల నుండి ఐదు రోజులకు తగ్గించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో పరీక్షా జవాబు కీపై 5 రోజుల (ఐదు రోజులు) వ్యవధిలో ప్రాతినిధ్యాలు ఇవ్వడానికి అభ్యర్థులకు కమిషన్ అవకాశం కల్పిస్తుంది.
CSE-2026కి దరఖాస్తు చేసుకునే ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులు 2022-2023, 2023-2024 , 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం ఆధారంగా ఏప్రిల్ 1, 2025న/తర్వాత (2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తయిన తర్వాత) జారీ చేసిన OBC (నాన్-క్రీమీ లేయర్) సర్టిఫికేట్ను సమర్పించాలి. కానీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కోసం దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి చివరి తేదీ అంటే ఫిబ్రవరి 24 కంటే ముందే ఉండాలి. దరఖాస్తుదారులు కామన్ అప్లికేషన్ ఫారమ్ (CAF) నింపేటప్పుడు వారి ఫోటోగ్రాఫ్ను అప్లోడ్ చేసి, వారి లైవ్ ఫోటోగ్రాఫ్ను కూడా తీసుకోవలి. బ్లాక్ పెన్తో తెల్ల కాగితంపై మూడుసార్లు (ఒకదాని క్రింద ఒకటి) సంతకం చేసి CAF నింపేటప్పుడు దానిని అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్లో కమిషన్ పేర్కొంది. అలాగే ఇకపై అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉండదు. అంతేకాకుండా దరఖాస్తు సవరణకు కూడా అవకాశం ఉండదు. దరఖాస్తుదారులు ఒకేసారి అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.