UPSC CAPF 2022 నోటిఫికేషన్ విడుదల.. భారత రక్షణ దళంలో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగావకాశాలు!

|

Apr 21, 2022 | 7:46 AM

బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎఎస్‌బీ కేంద్ర సాయుధ బలగాల్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల (Assistant Commandant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సీఏపీఎఫ్‌ - 2022 నోటిఫికేషన్‌..

UPSC CAPF 2022 నోటిఫికేషన్ విడుదల.. భారత రక్షణ దళంలో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగావకాశాలు!
Upsc Capf 2022
Follow us on

UPSC CAPF 2022 Application last date: బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎఎస్‌బీ కేంద్ర సాయుధ బలగాల్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల (Assistant Commandant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సీఏపీఎఫ్‌ – 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 253

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ కమాండెంట్లు పోస్టులు

ఖాళీల వివరాలు:

  • బీఎస్ఎఫ్ పోస్టులు: 66
  • సీఆర్‌పీఎఫ్ పోస్టులు: 29
  • సీఐఎస్ఎఫ్ పోస్టులు: 62
  • ఐటీబీపీ పోస్టులు: 14
  • ఎస్ఎస్‌బీ పోస్టులు: 82

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: బ్యాచిల‌ర్స్ డిగ్రీ లేదా త‌త్సమాన‌ కోర్సులో ఉత్తీర్ణత‌ సాధించి ఉండాలి. 2022లో డిగ్రీ చివరి సంవత్సరం ప‌రీక్షల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దీనితోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: రాతప‌రీక్ష, ఫిజిక‌ల్ స్టాండర్డ్స్‌/ ఎఫిషియ‌న్సీ టెస్టులు, ఇంట‌ర్వ్యూ/ ప‌ర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాతప‌రీక్ష విధానం: రెండు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్‌-1 ప‌రీక్ష ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల వ‌ర‌కు, పేప‌ర్‌-2 ప‌రీక్ష మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల నుంచి 5 గంట‌ల వ‌ర‌కు నిర్వహిస్తారు. పేప‌ర్‌-1లో జ‌న‌ర‌ల్ ఎబిలిటీ, ఇంట‌లిజెన్స్ విభాగాలు ఉంటాయి. దీన్ని 250 మార్కుల‌కు నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మ‌ల్టిపుల్ ఛాయిస్ ప‌ద్ధతిలో ఉంటాయి. ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి. పేప‌ర్‌-2లో జ‌న‌ర‌ల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ విభాగాలు ఉంటాయి. దీన్ని 200 మార్కుల‌కు నిర్వహిస్తారు. ‌

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.200
  • ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

ప‌రీక్ష తేది: ఆగస్టు 7, 2022.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: హైద‌రాబాద్‌, తిరుప‌తి, విశాఖ‌పట్నం.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 10, 2022.

దరఖాస్తుల ఉపసంహరణ తేదీలు: 2022, మే 17 నుంచి మే 23 సాయంత్రం 6 గంటల వరకు

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Infosys : ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌పై కేంద్రానికి ఫిర్యాదు.. ఆందోళనలో ఉద్యోగులు..