AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 2 Results 2025: నిరుద్యోగులకు అలర్ట్‌.. టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌!

రాష్ట్రంలో గ్రూప్‌ 2 పోస్టుల తుది ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 2 పోస్టులకు సంబందించిన ధ్రువపత్రాల పరిశీలన పూర్తికాగా.. తుది జాబితా సిద్ధం చేస్తోంది. నిజానికి 3 నెలల క్రితమే ఈ ఫలితాలను వెల్లడించాల్సి ఉంది..

TGPSC Group 2 Results 2025: నిరుద్యోగులకు అలర్ట్‌.. టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌!
TGPSC Group 2 Final Result date
Srilakshmi C
|

Updated on: Sep 20, 2025 | 5:01 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌ 2 పోస్టుల తుది ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 2 పోస్టులకు సంబందించిన ధ్రువపత్రాల పరిశీలన పూర్తికాగా.. తుది జాబితా సిద్ధం చేస్తోంది. నిజానికి 3 నెలల క్రితమే ఈ ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. కానీ గ్రూప్‌ 1 పోస్టుల చుట్టూ నెలకొన్న న్యాయవివాదాల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైంది. కాగా మొత్తం 783 గ్రూప్‌ 2 పోస్టులతో 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2024 డిసెంబరులో ఆఫ్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహించగా 2,49,964 మంది పరీక్షకు హాజరయ్యారు.

ఓఎంఆర్‌ పత్రాల్లో పొరపాట్లు, బబ్లింగ్‌ సరిగా చేయకపోవడం వంటి తదితర కారణాల వల్ల 13,315 మంది అభ్యర్థులను కమిషన్‌ అనర్హులుగా ప్రకటించింది. మిగతా 2,36,649 మంది మార్కులతో జనరల్‌ ర్యాంకు లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌ను ఈ ఏడాది మార్చి 11న విడుదల చేసింది. మెరిట్‌ లిస్ట్‌లో ఎంపికైన వారికి 1:1 నిష్పత్తిలో మూడు దఫాలుగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. ఇక తుది ఫలితాల కోసం ఎప్పుడెప్పుడాని అభ్యర్ధులు ఎదురు చూస్తున్నారు.

గ్రూప్‌ 3 పోస్టులకు మోక్షం ఎప్పుడో?

గ్రూప్‌ 3 కింద భర్తీ చేయనున్న 1388 పోస్టులకు 2024 నవంబరులో రాత పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,67,921 మంది ఈ పోస్టులకు హాజరయ్యారు. సాంకేతిక కారణాల వల్ల 18,364 మందిని కమిషన్‌ అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన 2,49,557 మందితో జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను మార్చి 14న వెల్లడించింది. మెరిట్‌ జాబితాలోని అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించేందుకు జూన్‌లో షెడ్యూలు ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత ఈ ప్రక్రియ వాయిదా వేసింది. గ్రూప్‌ 2 నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రూప్‌ 3 నియామకాలు పూర్తి చేయాలని కమిషన్‌ భావిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై