
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG EAPCET-2026 (ఎంసెట్) ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు, అంటే మే 17 ఆదివారం ఉదయం 11:00 గంటలకు జేఎన్టీయూ హైదరాబాద్ (JNTUH) లోని గోల్డెన్ జూబ్లీ హాల్లో ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఈఏపీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో వారితో డాక్టర్ యోగితా రాణా,సెక్రటరీ, విద్యాశాఖ, శ్రీదేవసేన, కమిషనర్, సాంకేతిక అండ్ కళాశాల విద్య ,ప్రొఫెసర్ వి. బాలకిస్తా రెడ్డి సహా ప్రముఖులు పాల్గొననున్నారు.
ఉదయం 11:00 గంటలకు ఫలితాల అనాలిసిస్తో కూడిన సీడీని విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన పాస్వర్డ్ను ఉదయం 11:15 గంటలకు ప్రకటిస్తారు. ఫలితాల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్స్ విద్యార్థుల మార్కులు, ర్యాంకులు. రెండు విభాగాలకు సంబంధించి టాప్-10 విద్యార్థుల వివరాలు ఉంటాయి. ఈ సంవత్సరం మే 4 నుంచి 11 వరకు జరిగిన ఈఏపీసెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. రెండు స్ట్రీమ్లకు కలిపి మొత్తం 2,82,195 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఇంజినీరింగ్ స్ట్రీమ్: మే 9, 10, 11 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 2,10,766 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 1,97,241 మంది (93.58%) పరీక్షకు హాజరయ్యారు.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్: మే 4, 5 తేదీల్లో జరిగిన ఈ పరీక్షల కోసం 90,977 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 84,954 మంది (93.38%) అభ్యర్థులు పరీక్ష రాశారు.
ఫలితాలను చెక్ చేసుకోవడం ఎలా?
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ర్యాంక్ కార్డ్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్: [https://eapcet.tgche.ac.in/](https://eapcet.tgche.ac.in/)
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.