
దేశ వ్యాప్తంగా వివిధ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 2,273 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 29వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే స్థానిక భాషలో రాయడం, చదవడం వచ్చి ఉండాలి. నోటిఫికేషన్లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్దుల వయోపరిమితి 2025 డిసెంబర్ 31వ తేదీ నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 18, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 48,480 నుంచి రూ. 85,590 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎస్బీఐ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.