SBI Recruitment 2022: చివరి అవకాశం! ఎస్బీఐలో 5008 క్లర్క్‌ పోస్టులకు నేటితో ముగుస్తున్న దరఖాస్తు ప్రక్రియ.. డిగ్రీ అర్హత..

|

Sep 27, 2022 | 8:41 AM

భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) హైదరాబాద్‌తో సహా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 5,008 జూనియర్‌ అసోసియేట్ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టుల (Junior Associate Posts)కు దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని గంటల్లోనే ముగియనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ రోజు..

SBI Recruitment 2022: చివరి అవకాశం! ఎస్బీఐలో 5008 క్లర్క్‌ పోస్టులకు నేటితో ముగుస్తున్న దరఖాస్తు ప్రక్రియ.. డిగ్రీ అర్హత..
SBI
Follow us on

SBI Clerk Recruitment 2022 Notification: భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) హైదరాబాద్‌తో సహా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 5,008 జూనియర్‌ అసోసియేట్ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టుల (Junior Associate Posts)కు దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని గంటల్లోనే ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు ఇదే చివరి అవకాశం. ఆసక్తి కలిగిన వారు ఈ రోజు (సెప్టెంబర్ 27, 2022వ తేదీ) ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్‌లో 225 వరకు ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటి లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదివే విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 20 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. ఆగస్టు 2, 1994 నుంచి ఆగస్టు 1, 2022వ తేదీల మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తుకు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి విషయంలో రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.750లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష నవంబర్‌ 2022లో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష డిసెంబర్‌ 2022 లేదా జనవరి 2023లో జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.19.900ల వరకు జీతంగా చెల్లిస్తారు. రాత పరీక్ష ఈ కింది విధంగా ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు ఇవే..

ఇవి కూడా చదవండి
  • అహ్మదాబాద్‌లో ఖాళీలు: 357
  • బెంగళూరులో ఖాళీలు: 316
  • భోపాల్‌లో ఖాళీలు: 481
  • బెంగాల్‌లో ఖాళీలు: 376
  • భువనేశ్వర్‌లో ఖాళీలు: 170
  • చండీగఢ్‌లో ఖాళీలు: 225
  • చెన్నైలో ఖాళీలు: 362
  • ఢిల్లీలో ఖాళీలు: 152
  • హైదరాబాద్‌లో ఖాళీలు: 225
  • జైపుర్‌లో ఖాళీలు: 284
  • కేరళలో ఖాళీలు: 273
  • ఢిల్లీలో ఖాళీలు: 631
  • ముంబాయిలో ఖాళీలు: 747
  • మహారాష్ట్రలో ఖాళీలు: 50
  • నార్త్‌ ఈస్టర్న్‌లో ఖాళీలు: 359

రాత పరీక్ష విధానం: 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 100 మార్కులకు గానూ గంట సమయంలో ఈ పరీక్ష జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కుల చొప్పున పరీక్ష ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంటుంది.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.