RRB Revised Exam Dates 2025: ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షల కొత్త తేదీలు వచ్చేశాయ్‌.. ఇంతకీ ఎప్పుడంటే?

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఇటీవల లోకో పైలట్‌ సీబీటీ 2 పరీక్షను రైల్వే శాఖ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన కూడా విడుదల చేసింది. తాజాగా ఈ పరీక్షల కొత్త తేదీలను రైల్వే శాఖ ప్రకటించింది..

RRB Revised Exam Dates 2025: ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షల కొత్త తేదీలు వచ్చేశాయ్‌.. ఇంతకీ ఎప్పుడంటే?
RRB Revised Exams Dates

Updated on: Apr 06, 2025 | 3:42 PM

హైదరాబాద్, ఏప్రిల్‌ 6: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఇటీవల లోకో పైలట్‌ సీబీటీ 2 పరీక్షను రైల్వే శాఖ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన కూడా విడుదల చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 19వ తేదీ రెండు షిఫ్ట్‌లలో ఈ పరీక్ష జరగవల్సి ఉండగా.. కానీ కొన్ని పరీక్ష కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు గుర్తించిన ఆర్‌ఆర్‌బీ పరీక్ష నిర్వహించలేక పోతున్నట్లు వెల్లడించింది. పరీక్ష తేదీలను రీషెడ్యూల్‌ చేసిన త్వరలో ప్రకటిస్తామని అప్పట్లో ప్రకటించింది కూడా.

అలాగే మార్చి 20వ తేదీ మొదటి షిఫ్ట్‌లో జరగాల్సిన పరీక్షను కూడా వాయిదా వేస్తున్నట్లు ఆర్‌ఆర్‌బీ తన ప్రకటనలో వెల్లడించింది. తాజాగా లోకో పైలట్‌ సీబీటీ-2 పరీక్షలకు సంబంధించిన తేదీలను ఆర్‌ఆర్‌బీ రీషెడ్యూల్‌ చేసింది. ఈ మేరకు కొత్త పరీక్ష తేదీలను రైల్వే శాఖ ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మే 2, 6వ తేదీల్లో లోకో పైలట్‌ సీబీటీ-2 పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు వాయిదా వేసిన కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల తేదీలను రైల్వేబోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్ష అడ్మిట్‌ కార్డులను కూడా త్వరలోనే వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) 2024 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. కాగా మార్చి 8, 16, 24 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎస్‌బీఐ ఫలితాలు విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాల ఖాళీల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. అనంరం ఇంటర్వ్యూ నిర్వహించి తుది నియామకాలు చేపడతారు.

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ పీఓ 2025 ప్రిలిమ్స్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.