PJTSAU Recruitment: సంగారెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..

| Edited By: Ravi Kiran

Aug 20, 2022 | 4:00 PM

PJTSAU Recruitment 2022: సంగారెడ్డి జిల్లా కందిలోని కాలేజ్ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయం విశ్వవిద్యాల పరిధిలో ఉండే ఈ కళాశాలలో టీచింగ్‌ పోస్టులను...

PJTSAU Recruitment: సంగారెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..
Kandi Agricultural College
Follow us on

PJTSAU Recruitment 2022: సంగారెడ్డి జిల్లా కందిలోని కాలేజ్ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయం విశ్వవిద్యాల పరిధిలో ఉండే ఈ కళాశాలలో టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో టీచింగ్ అసోసియేట్ (ఫుల్‌ టైం) – 05, టీచింగ్ అసోసియేట్ (పార్ట్ టైం) – 05 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంటెక్‌ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్/ సాయిల్ అండ్ వాటర్ ఇంజినీరింగ్/ ఫార్మ్ మెషినరీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్), ఎంఎస్సీ(అగ్రికల్చర్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ ఇంగ్లిష్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌, కంది, సంగారెడ్డి జిల్లా అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* ఇంటర్వ్యూలను 29-08-2022 తేదీన నిర్వహించనున్నారు.

* ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లతో హాజరుకావాల్సి ఉంటుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..