
ప్రపంచ వ్యాప్తంగా మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్ (శాంతి) విభాగాల్లో కృషి చేసిన వారికి ప్రతి యేట డిసెంబర్ 10న నోబెల్ ఫ్రైజ్ ప్రధానం చేస్తారు. నోబెల్ అవార్డు విలువ దాదాపు 10 మిలియన్ స్వీడిష్ క్రోన్స్ ($900,357). అంటే 9 లక్షల డాలర్లు (73 కోట్ల రూపాయలు). స్వీడిష్ డైనమైట్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేర ఈ బహుమతిని స్థాపించారు. నోబెల్ మరణించిన ఐదు సంవత్సరాల తర్వాత 1901 నుంచి నోబెల్ బహుమతులను అందజేయడం ప్రారంభించారు. 2022వ సంవత్సరానికి గానూ అన్ని రంగాల్లో నోబెల్ బహుమతులు అందుకోబోతున్న విజేతలు వీరే..

స్వాంటే పాబో వైద్యశాస్త్రంలో జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు ఈ బహుమతి లభించింది

ఫిజిక్స్లో విశేష కృషి చేసినందుకుగానూ అలేన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోన్ జైలింగర్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్-2022 వరించింది.

కెమిస్ట్రీలో విశేష పరిశోధనలు జరిపిన రోలిన్ ఆర్ బెర్టోజీ, మార్టెన్ మెల్డల్, కే బ్యారీ షార్ప్లెస్.. ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది.

పౌర హక్కుల కోసం కృషి చేస్తోన్న బెలారస్కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బియాలియాత్స్కీతో పాటు రష్యా, ఉక్రెయిన్లకు చెందిన మానవ హక్కుల సంస్థలు ‘మెమోరియల్’, ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కింది.

ఫ్రెంచ్ రచయిత్రి అన్నే ఎర్నాక్స్కు 2022 సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది.

బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై పరిశోధనలకుగానూ బెన్ షాలోమ్ బెర్నాంకే, డాగ్లస్ డబ్ల్యూ. డైమండ్, ఫిలిప్ హెచ్.డైబ్విగ్కు సంయుక్తంగా ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.