Attention! వారం రోజుల్లో ముగియనున్న జేఈఈ మెయిన్ 2022 దరఖాస్తు ప్రక్రియ.. పరీక్ష తేదీలివే!

|

Mar 22, 2022 | 3:06 PM

జేఈఈ మెయిన్ 2022కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చే వారంతో ముగుస్తుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్ధులెవరైనా ఉంటే గడువు తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని..

Attention! వారం రోజుల్లో ముగియనున్న జేఈఈ మెయిన్ 2022 దరఖాస్తు ప్రక్రియ.. పరీక్ష తేదీలివే!
Online Registration
Follow us on

JEE Main 2022 online registration will conclude next week: జేఈఈ మెయిన్ 2022కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చే వారంతో ముగుస్తుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్ధులెవరైనా ఉంటే గడువు తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ ఈ సందర్భంగా సూచించింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్‌ 2022 నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 31తో ముగుస్తుంది. ఇక ఈ పరీక్షకు సంబంధించిన తేదీల విషయంలో దేశ వ్యాప్తంగా పలు చర్చలు కూడా జరిగాయి. ఎట్టకేలకు జేఈఈ మెయిన్‌ కొత్త తేదీలు వెలువడినప్పటికీ పలు రాష్ట్రాల్లోని బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు ఆయా తేదీలు అడ్డుగా ఉండటంతో ఇంటర్‌, టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యుళ్లను కూడా మార్చి కొత్త టైం టేబుళ్లను విడుదల చేశాయి.

జేఈఈ మెయిన్ 2022 కొత్త పరీక్ష తేదీలు ఇవే..
జేఈఈ మెయిన్ – 2022 ఏప్రిల్‌ సెషన్‌కు సంబంధించిన తేదీలను మార్చాలని విద్యార్ధుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్ధనలు అందడంతో ఎన్టీఏ ఏప్రిల్ సెషన్ పరీక్ష తేదీలను సవరించి కొత్త తేదీలను ప్రకటించింది. దీంతో జేఈఈ మెయిన్ 2022 పరీక్షలు (JEE Main 2022 revised exam dates) ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్షతేదీల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది.

జేఈఈ మెయిన్ 2022కు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ అర్హతలుండాలి..
జేఈఈ మెయిన్ – 2022 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి వయోపరిమితి లేదు. అలాగే 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read:

KVS Admissions 2022: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..