JEE Advanced 2024 Admit Card: మరో రెండు రోజుల్లో జేఈఈ అడ్వాన్స్ అడ్మిట్ కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

|

May 15, 2024 | 6:54 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష అడ్మిట్ కార్డులు మే17వ తేదీన విడుదల చేయనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 26వ తేదీన ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఉదయం షిఫ్ట్‌లో పేపర్-1 పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు..

JEE Advanced 2024 Admit Card: మరో రెండు రోజుల్లో జేఈఈ అడ్వాన్స్ అడ్మిట్ కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?
JEE Advanced 2024 Admit Card
Follow us on

న్యూఢిల్లీ, మే 15: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష అడ్మిట్ కార్డులు మే17వ తేదీన విడుదల చేయనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 26వ తేదీన ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఉదయం షిఫ్ట్‌లో పేపర్-1 పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్ట్‌లో పేపర్-2 పరీక్ష 2.30 నుంచి 5.30 గంటల వరకు జరగనుంది. మొత్తం రెండు సెషన్లలో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మకమైన 23 ఐఐటీల్లో, ఇతర ప్రఖ్యాత సంస్థల్లో బీటెక్‌ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

కాగా ఈ ఏడాది రెండు విడతల్లో నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 2.5 లక్షల మందిని మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అనుమతిస్తారు. పరీక్ష అనంతరం ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ జూన్ 2న వెల్లడిస్తారు. కీపై అభ్యంతరాల నమోదు జూన్ 2 నుంచి జూన్ 3 వరకు స్వీకరిస్తారు. ఫైనల్ ఆన్సర్‌ కీతోపాటు జేఈఈ ఆడ్వాన్స్‌ తుది ఫలితాలను జూన్ 9వ తేదీన విడుదల అవుతాయి.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా ఉత్తీర్ణులైన వారు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏఏటీ-2024) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జూన్‌ 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఏఏటీ-2024 పరీక్ష జూన్‌ 12వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఐఐటీల్లోని బీఆర్క్‌ కోర్సుల్లో చేరేందుకు ఈ పరీక్షలో ర్యాంకులు సాధించవల్సి ఉంటుంది. ఏఏటీ ఫలితాలు జూన్‌ 15న వెల్లడిస్తారు. జూన్‌ 10 సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.