
నేటి డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నిత్యం వందలాది మంది ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో సైబర్ బెదిరింపుల నుంచి సాధారణ ప్రజలను రక్షించడం, వారిని అప్రమత్తం చేయడం చాలా ముఖ్యం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14C).. సైబర్ సెక్యూరిటీ రంగంలో యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఇంటర్న్షిప్ ద్వారా విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్లో అనుభవాన్ని పొందడమే కాకుండా సైబర్ నేరాల నుంచి దేశాన్ని సురక్షితంగా మార్చడంలోనూ దోహదపడగలరు.
ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 17, 2025వ తేదీ సాయంత్రం 5:30 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు. గడువు సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
क्या आप साइबर सिक्योरिटी या डिजिटल फ़ॉरेंसिक्स जैसे फील्ड्स में करियर बनाना चाहते हैं?
I4C लेकर आया है विंटर इंटर्नशिप प्रोग्राम
ग्रेजुएट, पोस्ट-ग्रेजुएट और पीएचडी स्टूडेंट्स के लिए
अभी Apply करें।https://t.co/gcZFHbjgIw
Last Date: 17/10/25, 05:30 PM pic.twitter.com/TRpNSfxdGJ
— CyberDost I4C (@Cyberdost) October 8, 2025
ఈ ఇంటర్న్షిప్ విద్యార్థులకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్లో ఆచరణాత్మక అనుభవాన్ని అందించడమే కాకుండా సైబర్ క్రైమ్ దర్యాప్తు, సమస్యల పరిష్కార విధానాలను నేర్పుతారు. ప్రఖ్యాత నిపుణులతో కలిసి పనిచేయడం ద్వారా ప్రజా భద్రత, జాతీయ భద్రతకు నేరుగా దోహదపడవచ్చు. అంతేకాకుండా ఈ కార్యక్రమం అభ్యర్ధుల రెజ్యూమ్ను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.