AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో ఒంటి పూట బడులు.. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం.. ఎప్పటి నుంచంటే.

|

Apr 01, 2022 | 12:09 PM

AP Schools: రోజురోజుకీ పెరుగుతోన్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 4 నంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు...

AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో ఒంటి పూట బడులు.. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం.. ఎప్పటి నుంచంటే.
Half Day Schools In Telanga
Follow us on

AP Schools: తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మండుతున్నాయి. సాధారణంగా కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దీంతో విద్యార్థులను ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఒంటి పూట బడులను ప్రారంభించిన విషయం తెలిసిందే. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా హాఫ్‌ డే స్కూల్స్‌ నిర్వహణకు సంబంధించి ప్రకటన జారీ చేసింది.

విపరీతంగా పెరుగుతోన్న ఎండలను పరిగణలోకి తీసుకున్న సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 4 నంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 7.30 నుంచి 11.30 వరకు పాఠశాలల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు.

ఇక విద్యార్థులకు ఏప్రిల్ 27 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొ్న్నారు. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను కరోనా నియమ నిబంధనాలను పాటిస్తూనే నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

Also Read: Gowtham Adani: 2022 అందరీకంటే ఎక్కువ డబ్బు సంపాదించిన అదానీ.. ప్రపంచంలో ఆయనది ఎన్నో స్థానమంటే..

Gowtham Adani: 2022 అందరీకంటే ఎక్కువ డబ్బు సంపాదించిన అదానీ.. ప్రపంచంలో ఆయనది ఎన్నో స్థానమంటే..

Market News: నెల ఆరంభంలో పాజిటివ్ గా ప్రారంభమైన సూచీలు.. స్వల్ప లాభాల మధ్య సాగుతున్న ట్రేడ్..