EMRS Jobs 2025: ఏకలవ్య రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం! ఎంపిక ఇలా

EMRS Teaching and Non Teaching Recruitment 2025 Notification: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (EMRS).. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న స్కూళ్లలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

EMRS Jobs 2025: ఏకలవ్య రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం! ఎంపిక ఇలా
EMRS Teaching and Non Teaching Jobs

Updated on: Oct 03, 2025 | 2:59 PM

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (EMRS).. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న స్కూళ్లలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 7,267 ప్రిన్సిపల్‌, పీజీటీ, హాస్టల్‌ వార్డెన్‌ వంటి పలు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఈ నెల 23, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇవే..

  • ప్రిన్సిపల్‌ పోస్టుల సంఖ్య: 225
  • పీజీటీ పోస్టుల సంఖ్య: 1,460
  • హాస్టల్‌ వార్డెన్‌ (మేల్‌) పోస్టుల సంఖ్య: 346
  • జూనియర్ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (క్లర్క్‌) పోస్టుల సంఖ్య: 228
  • అకౌంటెంట్‌ పోస్టుల సంఖ్య: 61
  • స్టాఫ్‌ నర్స్‌ (ఫీమేల్‌) పోస్టుల సంఖ్య: 550
  • టీజీటీ పోస్టుల సంఖ్య: 3,962
  • హాస్టల్‌ వార్డెన్‌ (ఫీమేల్‌) పోస్టుల సంఖ్య: 289
  • ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టుల సంఖ్య: 146

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి సంబంధిత విభాగం నుంచి పీజీ, బీఈడీ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్‌, ఇంటర్‌, టెన్త్‌, డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ప్రిన్సిపల్ పోస్టులకు 50 ఏళ్లు, పీజీటీకి 40 ఏళ్లు, టీజీటీకి 35 ఏళ్లు, అకౌంటెంట్‌కు 30 ఏళ్లు, ల్యాబ్‌ అటెండెంట్‌కు 30 ఏళ్లు, హాస్టల్‌ వార్డెన్‌, ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌కు 35 ఏళ్లు, జూనియర్ సెక్రటేరియట్‌ అటెండెంట్‌కు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 23, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ప్రిన్సిపల్‌ పోస్టుకు రూ.2,500, టీజీటీ, పీజీటీ పోస్టులకు రూ.2,000, నాన్‌-టీచింగ్‌ పోస్టులకు రూ.1,500 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌, మహిళా అభ్యర్థులకు మాత్రం అన్ని పోస్టులకు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఎంపికైన వారికి జీతభత్యాలు ఇలా..

  • ప్రిన్సిపల్‌ పోస్టులకు నెలకు: రూ.78,800 నుంచి రూ.2,09,200 వరకు
  • పీజీటీ పోస్టులకు నెలకు: రూ.47,600 నుంచి రూ.1,51,100 వరకు
  • టీజీటీ పోస్టులకు నెలకు: రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు
  • అకౌంటెంట్‌ పోస్టులకు నెలకు: రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు
  • ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టులకు నెలకు: రూ.18,000 నుంచి రూ.56,900 వరకు
  • హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులకు నెలకు: రూ.29,200 నుంచి రూ.92,300 వరకు
  • ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు నెలకు: రూ.29,200 నుంచి రూ.92,300 వరకు
  • జూనియర్ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నెలకు: రూ.19,900 నుంచి రూ.63,200 వరకు

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.