
అమరావతి, జులై 1: ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈ ఫలితాలను ఏపీ విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసిన విద్యార్ధుల్లో 70.52 శాతం మంది విద్యార్ధులు అర్హత సాధించినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 2,76,572 మంది విద్యార్ధులు ఈఏపీసెట్కు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 2,58,545 మంది హాజరయ్యారు. వీరిలో 1,82,317మంది అంటే 70.52 శాతం మంది క్వాలిఫై అయినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో 79,231మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 70,929 మంది పరీక్ష రాశారు. వీరిలో 63,546 మంది అంటే 89.59 శాతం మంది క్వాలిఫై అయినట్లు పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. తాజా ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి టాప్ ర్యాంకు సాధించాడు.
ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.