AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt Jobs: ఎంబీబీఎస్‌ చేసిన వారికి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. మరో మూడు రోజుల్లో ముగియనున్న చివరి తేదీ..

AP Govt Jobs: విజయవాడలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌ కార్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏపీవీవీపీ ఆసుపత్రులు...

AP Govt Jobs: ఎంబీబీఎస్‌ చేసిన వారికి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. మరో మూడు రోజుల్లో ముగియనున్న చివరి తేదీ..
Narender Vaitla
|

Updated on: Aug 03, 2022 | 6:31 PM

Share

AP Govt Jobs: విజయవాడలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌ కార్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏపీవీవీపీ ఆసుపత్రులు, డీఎంఈ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 823 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 823 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌లో (635), ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో (188) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 42 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 61,960 జీతంగా చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 06-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..