
PM Kisan: లక్షలాది మంది రైతుల ఎన్నో రోజుల నిరీక్షణ ఈరోజుతో ముగిసింది. పీఎం కిసాన్ 21వ విడత రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్రం. తమిళనాడులోని కోయంబత్తూరులో 9 కోట్లకు పైగా రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం PM-KISAN పథకం తదుపరి విడతను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు తదుపరి విడత బదిలీ చేయనున్నట్లు వ్యయవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న తెలిపారు.అయితే ముఖ్యంగా పీఎం కిసాన్ జాబితా నుండి 7 మిలియన్ల మంది రైతుల పేర్లు తొలగించింది కేంద్రం.
PM-KISAN పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందిస్తుంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది కేంద్రం.
21వ విడతకు అర్హులైన రైతుల సంఖ్య దాదాపు 7 మిలియన్లు తగ్గింది. ఈ పథకానికి అనర్హులైన రైతులను గుర్తించడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న కఠినమైన ప్రచారం దీనికి కారణం. అనర్హులుగా ఉన్న రైతులను గుర్తించి పీఎం కిసాన్ జాబితా నుంచి తొలగించింది కేంద్రం. ఈ జాబితా నుంచి సుమారు 70 లక్షల మందిని తొలగించింది.
పీఎం కిసాన్ మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులను గుర్తిస్తాయి. ఆదాయ పరిమితి పరిధిలోకి రాని రైతులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికైన ప్రతినిధులు, రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ నెలవారీ పెన్షన్ పొందుతున్నవారు వీరిలో ఉన్నారు. PM-KISAN పథకం ప్రయోజనాలను అర్హత కలిగిన రైతులు మాత్రమే పొందేలా చూడటం కేంద్రం లక్ష్యం.
ఇలాంటి వ్యక్తులు పీఎం కిసాన్ పథకం ప్రయోజనం పొందేందుకు అనర్హులు.
ఇది కూడా చదవండి: SBI నుండి రూ. 60 లక్షల గృహ రుణం తీసుకోవడానికి మీ జీతం ఎంత ఉండాలి. EMI ఎంత?
ఇది కూడా చదవండి: Best Bikes: భారత్లో 5 చౌకైన బైక్లు ఇవే.. రూ. 55,000 నుండి ప్రారంభం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి