Gold Jewelry: ఇకపై బంగారు ఆభరణాలకూ ఆధార్ లాంటి యూనిక్ ఐడీ నెంబర్లు..దొంగతనం జరిగినా గుర్తించడం సులభం!

Gold Jewelry: బంగారు నగలకు కూడా ఆధార్ లాంటి వ్యవస్థ రాబోతోంది. నగలు ఎక్కదైనా దొంగతనానికి గురయినా లేదా పోగొట్టుకున్నా, అది కరిగించి ఉండకపోతే, ఇకపై దాని నిజమైన యజమానిని సులభంగా గుర్తించవచ్చు.

Gold Jewelry: ఇకపై బంగారు ఆభరణాలకూ ఆధార్ లాంటి యూనిక్ ఐడీ నెంబర్లు..దొంగతనం జరిగినా గుర్తించడం సులభం!
Gold Jewelry

Updated on: Jun 28, 2021 | 8:28 PM

Gold Jewelry: బంగారు నగలకు కూడా ఆధార్ లాంటి వ్యవస్థ రాబోతోంది. నగలు ఎక్కదైనా దొంగతనానికి గురయినా లేదా పోగొట్టుకున్నా, అది కరిగించి ఉండకపోతే, ఇకపై దాని నిజమైన యజమానిని సులభంగా గుర్తించవచ్చు. ఇది ఇంచుమించుగా, ఆధార్ కార్డులోని యుఐడి ద్వారా దేశ పౌరులందరినీ గుర్తించిన విధంగానే ఉంటుంది. దీనికోసం జూలై 1 నుండి, ప్రభుత్వం ప్రతి నగల ప్రత్యేకమైన గుర్తింపును (యుఐడి) తప్పనిసరి చేస్తోంది. ఈ యుఐడిలో, ఆభరణాల అమ్మకం కోడ్, ఆభరణాల గుర్తింపు నమోదు చేయడం జరుగుతుంది. బీఐఎస్ (BIS) తీసుకువచ్చిన మొబైల్ యాప్ లో పోలీసులు, అలాగే ఎవరైనా ఈ యూఐడీ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే..ఈ ఆభరణాలను ఎప్పుడు, ఎక్కడ నుండి కొనుగోలు చేశారో తెలుస్తుంది. ఈ యుఐడి ఆభరణాలను ఎవరికి అమ్మారో ఆ కస్టమర్ వివరాలు కూడా ఆభరణాల విక్రేత దగ్గర సమాచారం ఉంటుంది.

నాలుగు నుంచి మూడుకు..

చాలా కాలంగా ఆభరణాలలో హాల్‌మార్కింగ్ ఇస్తున్నారు. దీనికి ఇప్పటి వరకూ నాలుగు మార్కులు ఉన్నాయి, ఇవి బీఐఎస్ (BIS) లోగో, స్వచ్ఛత, హాల్ మార్కింగ్ సెంటర్, ఆభరణాల బార్‌ను సూచిస్తాయి. ఇప్పుడు కొత్త యుఐడి ఆధారిత హాల్ మార్కింగ్‌లో మార్కుల సంఖ్యను నాలుగు నుండి మూడుకు తగ్గించారు. వీటిలో బీఐఎస్ (BIS) లోగో, స్వచ్ఛత, మూడవ మిశ్రమ ముద్ర ఉంటుంది. ఇది ఆభరణాలరకం, ఆభరణాల క్వాలిటీను వివరిస్తుంది. ఈ అమరిక ప్రామాణికం కాని ఆభరణాల అమ్మకాన్ని అరికట్టడానికి సహాయపడుతుంది.

సెప్టెంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా హాల్‌మార్కింగ్ వర్తిస్తుంది..

దేశంలోని 256 జిల్లాల్లో బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ తప్పనిసరి అయింది. ఇప్పటి నుండి ఈ జిల్లాల్లో, ఆభరణాలు హాల్‌మార్క్ చేసిన ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేసి విక్రయించగలవు. ఆభరణాల వ్యాపారులందరికీ తమ వద్ద ఉన్న పాత స్టాక్‌ను హాల్‌మార్క్ చేయడానికి ప్రభుత్వం సెప్టెంబర్ 1 వరకు సమయం ఇచ్చింది. అప్పటి వరకు వారు పాత స్టాక్‌పై హాల్‌మార్కింగ్ చేయవలసి ఉంటుంది. ఈ కాలంలో ఏ వ్యాపారిపై ఎటువంటి చర్యలు తీసుకోరు.

బీఐఎస్ (BIS) లైసెన్స్ దేశంలో కనీసం 10% వ్యాపారులకు కూడా లేదు అని జ్యువెలర్స్ ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) జాతీయ కార్యదర్శి, సురేంద్ర మెహతా అన్నారు. ప్రభుత్వం ఆభరణాల కోసం 1 సంవత్సరానికి పైగా రిజిస్ట్రేషన్ ఇచ్చిందని చెప్పారు. అయితే ప్రస్తుతం దేశంలో సుమారు 5 లక్షల మంది ఆభరణాల వ్యాపారులు ఉన్నారు. వీరిలో సుమారు 40 వేల మంది నమోదు చేసుకున్నారు. అంటే, 1 సంవత్సరంలో 10% ఆభరణాల వ్యాపారులు కూడా నమోదు కాలేదు. అని ఆయన చెప్పారు.

Also Read: Investment Scheme: రోజుకు రూ. 200 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ. 14 లక్షల వరకు ఆదాయం.. ఈ స్కీమ్‌ పూర్తి వివరాలు..!

Privatization of 2 Banks : త్వరలో ఈ 2 బ్యాంకులు ప్రైవేటీకరణ..! ఉద్యోగులు, ఖాతాదారుల పరిస్థితి ఏంటో తెలుసుకోండి..