Crypto Currencies: క్రిప్టో కరెన్సీలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..!

|

Apr 28, 2022 | 8:30 PM

Crypto Currencies: మన దేశంలో క్రిప్టో కరెన్సీలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా తరువాత డిజిటల్ ఎసెట్స్(Digital assets), క్రిప్టో కాయిన్స్ పెట్టుబడులు దేశంలో భారీగా పెరిగాయి.

Crypto Currencies: క్రిప్టో కరెన్సీలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..!
Crypto Currencies
Follow us on

Crypto Currencies: మన దేశంలో క్రిప్టో కరెన్సీలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా తరువాత డిజిటల్ ఎసెట్స్(Digital assets), క్రిప్టో కాయిన్స్, స్టాక్ మార్కెట్ల(Stock Markets) వంటి వాటిలో ఎక్కువ మంది రిటైలర్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ తరుణంలో బడ్జెట్ సమయంలో క్రిప్టో ఆదాయాలపై ఏకంగా 30 శాతం పన్నుతో పాటు, చెల్లింపుల్లో టీడీఎస్ కూడా వసూలు చేస్తామని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో.. క్రిప్టో కరెన్సీల నియంత్రణపై భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయం తీసుకుంటుందంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డిజిటల్ కరెన్సీలపై తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేశారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మేరకు నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని.. సరైన నిర్ణయాలు తీసుకోవటానికి మరింత సమయం పడుతుందని నిర్మల అభిప్రాయపడ్డారు.

క్రిప్టో డిజిటల్ ఆస్తులకు సంబంధించి అన్ని విషయాలను తప్పక పరిగణలోకి తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. ఆ తరువాతే క్రిప్టో రెగ్యులేషన్స్ పై తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీలను మనీ లాండరింగ్ నుంచి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే వరకూ అనేకమైన మార్గాల్లో దుర్వినియోగం చేస్తున్నారని ఆర్థిక మంత్రి అన్నారు. అంతేకాక అన్ని దేశాలు కలిసి కట్టుగా ఈ కరెన్సీలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇవి దేశాల ఆర్థిక స్థిరత్వానికి అత్యంత ప్రమాదకరమని గతంలోనే అన్నారు. ఈ విషయంలో కేవలం భారత్ మాత్రమే కాకుండా.. అనేక ఇతర దేశాలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నాయన్నారు. అందరూ కలిసికట్టుగా ఈ ప్రమాదం నుంచి భయటపడాలని.. అందుకు ముందుగా ఆందోళలను పరిష్కరించాలని అన్నారు.

క్రిప్టో కరెన్సీలకు చెక్ పెట్టేందుకు రిజర్వు బ్యాంక్ సొంతంగా డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలోనే పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ డిజిటల్ రూపీని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇవీ చదవండి..

Vijaya Gadde: తెలుగు మహిళను టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ ని కొన్న వెంటనే ఎందుకిలా చేస్తున్నాడంటే..

Elon Musk: ఎలాన్ మస్క్ విచిత్ర ప్రవర్తనకు ఒక వ్యాధి కారణమని తెలుసా.. ఇంతకీ దాని లక్షణాలేంటంటే..