
ప్రస్తుతం ప్రతి కుటుంబానికి సొంత కారు తప్పసరి అయ్యింది. మధ్య తరగతి ప్రజలు కూడా కార్లను కొనడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సమయానికి వెళ్లడంతో పాటు రక్షణగా కూడా ఉంటుంది. కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నప్పుడు కారు చాలా ఉపయోగంగా ఉంటుంది.
కొత్త కారు కొనడం ఖర్చుతో కూడుతున్న పని. మధ్యతరగతి ప్రజలకు అది కష్టమే. అయినా ఎటువంటి ఆందోళనా వద్దు. కొత్త కారు కొనడానికి బ్యాంకులు రుణాలిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు జీరో డౌన్ పేమెంట్ కార్ లోన్ల ను మంజూరు చేస్తున్నాయి. ఎంపిక చేసిన మోడల్లకు ఆన్ రోడ్ ధరలో వందశాతం కవర్ చేస్తున్నాయి. అంటే మీరు డౌన్ పేమెంట్ గురించి కూడా ఇబ్బంది పడకుండా సొంత కారును సమకూర్చుకోవచ్చు.
బ్యాంకులు మంజూరు చేసే కారు రుణాలను ఎంత వడ్డీ విధిస్తున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే సరైన బ్యాంకును ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. వడ్డీరేట్లు మీరు ప్రతినెలా చెల్లించే ఈఎమ్ఐ లను ప్రభావితం చేస్తాయి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మరింత అనుకూలమైన వడ్డీ రేటుకు రుణం పొందవచ్చు. కాబట్టి మీరు కొనుగోలు చేయాలనుకునే కారు ఫీచర్ల గురించి తెలుసుకోవడంతో పాటు బ్యాంకుల రుణాల వడ్డీరేట్లపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.
కారు కొనుగోలు చేయడానికి వివిధ బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి. ప్రముఖ బ్యాంకులు వసూలు చేసే వడ్డీరేట్లు, ప్రాసెసింగ్ ఫీజు తదితర వివరాలను తెలుసుకుందాం.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుతం ఉన్న హౌసింగ్ లోన్ తీసుకున్నవారికి, కార్పొరేట్ జీతం ఖాతాదారులకు 0.25 శాతం వడ్డీ రేటు రాయితీని అందిస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 800, అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్లతో రుణగ్రహీతలకు 0.50 శాతం వడ్డీ రేటు రాయితీ ఇస్తోంది. అలాగే 750, 799 మధ్య క్రెడిట్ స్కోర్లు ఉన్నవారు 0.25 శాతం రాయితీని అందుకుంటారు. ఇంకా పీఎస్బీ అప్నా వాహన్ సుగమ్ కోసం ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం వరకు రాయితీ ఆఫర్ ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..