భారతదేశంలో నిర్ణీత ఆదాయం దాటాక ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం అనేది చాలా కీలకం. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి జూలై 31తో గడువు ముగుస్తుంది. అయితే ఈ గడువు లోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే జరిమానాలతో పాటు వడ్డీ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ జరిమానాలు ఫైలింగ్ ఎంత ఆలస్యమైందనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మనం చెల్లించే పన్ను బట్టి ఈ ఫీజు మారుతూ ఉంటుంది. ఐటీ రిటర్న్స్ సకాలంలో ఫైల్ చేయడం ద్వారా అనవసరమైన ఆర్థిక భారాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పన్ను రీఫండ్కు అర్హత ఉంటే ఐటీఆర్ను తక్షణమే ఫైల్ చేయడం వల్ల మీరు మీ రీఫండ్ను త్వరగా పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైలింగ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది. కాబట్టి ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేయడం ఆలస్యం చేయడం వల్ల మీ రీఫండ్ ఆలస్యం అవుతుంది.అయితే ఐటీఆర్కు సంబంధించిన ఫైలింగ్ గడువు పొడిగిస్తారని చాల మంది అనుకుంటారు. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైలింగ్కు సంబంధించి గడవు తేదీ పొడగించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే గడువు దాటాక ఆలస్య రుసుముతో మీ పన్ను రిటర్న్ను ఫైల్ చేయవచ్చు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆలస్యంగా రిటర్న్ను ఫైల్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2024గా ఉంది. ఈ నేపథ్యంలో ఐటీఆర్ను ఆలస్యంగా ఫైల్ చేయడం వల్ల కలిగే నష్టాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..