AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Motors: టాటా మోటార్స్‌ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు.. 30 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. 500 కి.మీ మైలేజీ

Tata Motors: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ వాహనాలు వచ్చేస్తున్నాయి. వాహనదారులు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు...

Tata Motors: టాటా మోటార్స్‌ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు.. 30 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. 500 కి.మీ మైలేజీ
Tata Motors Avinya
Subhash Goud
|

Updated on: May 01, 2022 | 1:27 PM

Share

Tata Motors: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ వాహనాలు వచ్చేస్తున్నాయి. వాహనదారులు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక టాటా మోటార్స్‌ తన సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు ‘అవిన్యా’ (Avinya)ను ఆవిష్కరించింది. అవిన్యా పేరుతో ఈ కొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ (Electric SUV)ని తీసుకొస్తున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. ఈ అవిన్యా ఎలక్ట్రిక్‌ కారు అదరగొడుతోంది. స్మార్ట్ లుక్‌లో దర్శనమిస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్‌ కారు 2025 నాటికి మార్కెట్లో తీసుకువస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. సరికొత్త ప్యూర్ ఈవీ థర్డ్ జనరేషన్ ఆర్కిటెక్చర్‌ను ఆధారంగా చేసుకుని Tata Avinya రూపొందిస్తున్నట్లు తెలిపింది.

కేవలం 30 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్‌ ఛార్జింగ్‌:

ఈ కొత్తతరం కారు కేవలం 30 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జింగ్‌ అవుతుందని, ఆల్ట్రా ఫాస్ట్‌ ఛార్జ్‌ సామర్థ్యానికి సపోర్టు ఇచ్చేలా ఈ కారు బ్యాటరీ ఉంటుదని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా 30 నిమిషాల ఛార్జింగ్‌కి కనీసం 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని టాటా మోటార్స్‌ పేర్కొంది. ఈ కారుకు ఆకర్షణీయమైన ఎల్ఈడీ లైట్లను టీ ఆకారంలో అందిస్తోంది కంపెనీ ముందు వైపు పెద్ద బ్లాక్ ప్యానల్ ఉంటుంది.

భారతీయ రోడ్లకు అనుగుణంగా కారు తయారీ:

ఈ ఎలక్ట్రిక్‌ కారును భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేస్తున్నట్లు టాటా మోటార్స్‌ తెలిపింది. సేఫ్టీ, సెక్యూరిటీలో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అత్యంత శక్తివంతమైనదని, ఇందులో డస్ట్ ప్రొటెక్షన్ కోసం అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ కూడా రూపొందించినట్లు తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

No Cost EMI: నో కాస్ట్‌ ఈఎంఐ అంటే ఏమిటి..? దీని వల్ల ప్రయోజనం ఏమిటి..? ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారు గుర్తించుకోవాల్సిన విషయాలు

SSY Account Transfer: సుకన్య సమృద్ధి ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ చేసుకోవడం ఎలా?

వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..