SBI Customer: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. కరోనా సమయంలో కొత్త సర్వీసులను అందుబాటులోకి..!

|

May 07, 2021 | 1:58 PM

SBI Customer: దేశంలో ప్రభుత్వ రంగ అతిపెద్ద స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన కస్టమర్లకు శుభావార్త వినిపించింది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న..

SBI Customer: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. కరోనా సమయంలో కొత్త సర్వీసులను అందుబాటులోకి..!
Sbi
Follow us on

SBI Customer: దేశంలో ప్రభుత్వ రంగ అతిపెద్ద స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన కస్టమర్లకు శుభావార్త వినిపించింది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఖాతాదారులు కాంటాక్ట్‌లెస్ సర్వీసులు పొందటానికి వీలుగా టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే కస్టమర్లు బ్రాంచులకు వెళ్లకుండా పలు రకాల సర్వీసులు పొందవచ్చని తెలిపింది. అత్యవసర బ్యాంకింగ్ సర్వీసుల కోసం రెండు కస్టమర్ కేర్ నెంబర్లను అందుబాటులో ఉంచింది. కరోనా సమయంలో ఇంట్లో నుంచే పలు బ్యాంకింగ్ సేవలు పొందాలని భావించే వారికి ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.

ఎస్‌బీఐ కస్టమర్లు 1800 112 211, 1800 425 3800 నెంబర్లకు కాల్ చేసి కాంటాక్ట్‌లెస్ బ్యాంకింగ్ సర్వీసులు పొందవచ్చు. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. మీకు సేవలు అందిస్తాం. టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి అత్యవసర బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.
ఖాతా యొక్క బ్యాలెన్స్ వివరలు, చివరి ఐదు లావాదేవీల వివరాలు, ఏటీఎం కార్డు బ్లాకింగ్, డెబిట్ కార్డు జారీ, ఏటీఎం పిన్ జనరేట్ చేసుకోవడం, కొత్త ఏటీఎం కార్డుకు దరఖాస్తు చేసుకోవడం ఇలా పలు రకాల సేవలు టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి పొందవచ్చని ఎస్‌బీఐ వెల్లడించింది.