Sankranti Special Trains: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు..

|

Jan 05, 2024 | 3:46 PM

Railway Passenger Alert: సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకులకు లబ్ధి చేకూరేలా ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది. జనవరి 2న 32 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. జనవరి 4న మరో 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

Sankranti Special Trains: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు..
Sankranti Special Trains
Follow us on

సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకులకు లబ్ధి చేకూరేలా ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది. జనవరి 2న 32 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. జనవరి 4న మరో 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకులకు లబ్ధి చేకూరుస్తూ.. మరో ఆరు ప్రత్యేక రైళ్లను ద.మ.రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్-బ్రహ్మపూర్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్-బ్రహ్మపూర్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది. వీటితో కలిపి రైల్వే శాఖ నడపనున్న సంక్రాంతి ప్రత్యేక రైళ్ల సంఖ్య 42కి చేరింది.

ప్రత్యేక రైలు 07025 జనవరి 12, 19 తేదీల్లో రాత్రి 07:45 గం.టలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:15 గం.లకు బ్రహ్మపూర్ చేరుకోనుంది. అలాగే ఎదురుదిశలో ప్రత్యేక రైలు నెం.07026 జనవరి 13, 20 తేదీల్లో మధ్యాహ్నం 12:30 గం.లకు బ్రహ్మపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06:30 గం.లకు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది.

అలాగే ప్రత్యేక రైలు నెం.07027 జనవరి 13న రాత్రి 10:40 గంటలకు హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 03:15 గం.లకు బ్రహ్మపూర్‌కి చేరుకోనుంది. ఎదురుదిశలో ప్రత్యేక రైలు నెం.07028 జనవరి 14న సాయంత్రం 06:00 గంటలకు బ్రహ్మపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30 గం.లకు హైదరాబాద్ చేరుకుంటుంది.

సికింద్రాబాద్-బ్రహ్మపూర్ మధ్య నడిచే నాలుగు సర్వీసుల ప్రత్యేక రైళ్లు (నెం.07025/07026) నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, సోంపేట, ఇచ్చాపురం రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.

అలాగే సికింద్రాబాద్-బ్రహ్మపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైలు నెం.07093/07094 సికింద్రాబాద్, జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, సోంపేట, ఇచ్చాపురం రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.

ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. నేరుగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు, లేదా ఐఆర్‌సీటీసీ పోర్టల్ ద్వారా ప్రయాణీకులు తమ టికెట్లను రిజర్వ్ చేసుకోవచ్చు..

ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా 36 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చెక్ చేసుకోండి..