
Post Office: ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరైపోయింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం తప్పనిసరి అని నిపుణులు పదేపదే సూచిస్తుంటారు. అయితే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించలేని వారు కూడా చాలా మందే ఉంటారు.
అలాంటి వారి కోసం పోస్టాఫీసులు తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్ అందే పాలసీలు కూడా ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల కోసం ఇండియా పోస్ట్ ఆఫీస్ ఒక ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను తీసుకువచ్చింది. కేవలం తక్కువ ప్రీమియంతో రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ పొందే అవకాశం ఇస్తోంది. ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రమే.
ఇది కూడా చదవండి: SBI: మీరు ఎస్బీఐలో ఎఫ్డీపై రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత వస్తుంది?
ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో సంవత్సరానికి కేవలం రూ.555 చెల్లిస్తే చాలు.. రూ. 10 లక్షల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. దీనిని 18 ఏళ్ల నుండి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఎవరైనా ఈ పాలసీలో చేరవచ్చు. ఈ స్కీమ్లో చేరడానికి ఎలాంటి మెడికల్ చెకప్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు.
ఇక పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే లేదా శాశ్వత పూర్తి వైకల్యానికి గురైనా అతని నామినీకి రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ డబ్బులు అందుతాయి. ఏదైనా ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరితే ట్రిట్మెంట్ కోసం రూ. 1 లక్ష వరకు వైద్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ స్కీమ్లో చేరాలనుకునే వారు సమీపంలోని పోస్ట్ ఆఫీస్ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో అప్లై చేసుకోవాలంటే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లేదా ఓటర్ ఐడీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరమని గుర్తించుకోండి. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే పోస్టాఫీసును సందర్శిస్తే సరిపోతుంది.
ఇది కూడా చదవండి: Gold: బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభం.. రూ.1 లక్షకు రూ.3.04 లక్షలు!
ఇది కూడా చదవండి: Vinayaka Chavithi: వీధుల్లో భారీ వినాయకుడిని ఎందుకు పెడతారు? దీని వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి