ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రముఖమైన పంజాబ్ నేషనల్ బ్యాంకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. లాకర్ అగ్రిమెంట్ కు సంబంధించి మార్పులు చేసింది. లాకర్ కలిగిన ఖాతాదారులు తమ పీఎన్బీ బ్రాంచ్ కు వచ్చి కొత్త నిబంధనలు తెలుసుకోవాలని సూచించింది. ఈ మేరకు బ్యాంకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ హక్కులను తెలుపుతూ రివైజ్డ్/సప్లిమెంటరీ లాకర్ ఒప్పందాన్ని జారీ చేసింది. బ్యాంక్ నుంచి లాకర్ సౌకర్యాలను పొందుతున్న కస్టమర్లు తమ లాకర్ హోల్డింగ్ బ్రాంచ్ను సంప్రదించి, వర్తించే విధంగా సవరించిన/సప్లిమెంటరీ లాకర్ ఒప్పందాన్ని సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాం’ అని పేర్కొంది.
Important Announcement📢 Please take a note#Announcement #Lockers #Digital #Banking #PNB pic.twitter.com/gwHJw79t3D
ఇవి కూడా చదవండి— Punjab National Bank (@pnbindia) July 5, 2023
దేశ వ్యాప్తంగా బ్యాంకు లాకర్లకు డిమాండ్ పెరుగుతోంది. తమ విలువైన వస్తువులు, నగలు, ఆభరణాలు ఇంట్లో ఉండటం కన్నా బ్యాంకు లాకర్లైతేనే సురక్షితమని వినియోగదారులు భావిస్తున్నారు. ఇంట్లో ఉంచితే దొంగల భయం, ఇంట్లో ఉంచి ఎటైనా టూర్ వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉంటోంది. దీంతో అందరూ బ్యాంకు లాకర్లే సేఫ్ అని అటువైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంకు తమ వినియోగదారులతో అగ్రిమెంట్ ను సవరించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
పంజాబ్ నేషనల్ బ్యాంక్లో లాకర్ సౌకర్యాన్ని పొందే కస్టమర్లు తప్పనిసరిగా రివైజ్జ్ చేసిన లేదా అనుబంధ ఒప్పందంపై సంతకం చేయడానికి బ్యాంక్కి వెళ్లాలి. తగిన స్టాంప్ పేపర్ తప్ప, ఇతర పత్రాలు అవసరం లేదు. కస్టమర్ తప్పనిసరిగా స్టాంప్ డ్యూటీని చెల్లించాలని గమనించాలి.
పీఎన్బీ తన వినియోగదారులకు వివిధ పరిమాణాలలో లాకర్లను అందిస్తుంది. ఈ లాకర్లన్నీ వాటి పరిమాణాల ఆధారంగా ఐదు వర్గాలుగా వర్గీకరించారు. ప్రతి ఎంపికకు రుసుములు మారుతూ ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..