కొత్తగా అకౌంట్ తెరవాలంటే రూ.200 కట్టాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి..

కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో కీలక మార్పులు చేసింది. ఇక నుంచి అకౌంట్ తెరిచేందుకు ఛార్జీలు వసూలు చేయనున్నారు. కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసేందుకు వీటిని వసూలు చేస్తారు. అయితే ఒకేసారి వీటిని తీసుకోరు. విడతల వారీగా వీటిని కట్ చేసుకుంటారు.

కొత్తగా అకౌంట్ తెరవాలంటే రూ.200 కట్టాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి..
Nps

Updated on: Sep 01, 2026 | 9:40 PM

నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలను తీసుకురానుంది. అంతేకాకుండా ఈ పథకంలో చేరేవారి నుంచి ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఒక్కో పీఆర్‌ఏన్‌పై రూ.200 వన్ టైమ్ ఛార్జీ వసూలు చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈకొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రూ.200 రుసుంను ఒకేసారి వసూలు చేయరు. ప్రతీ త్రైమాసికానికి రూ.50 చొప్పున వసూలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. యూనిట్లను రద్దు చేసి వీటిని వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

అలాగే ఎన్‌పీఎస్ పథకాలను ఈక్విటీ పెట్టుబడుల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇక నుంచి 80 శాతం నుంచి 100 శాతం ఈక్విటీ ఉన్న పథకాలను కేటగిరీలో ఏ-గా వర్గీకరించనుండగా.. వీటిని హైరిస్క్ పరిగణిస్తారు. ఇక 60 నుంచి 80 శాతం ఈక్విటీ పెట్టుబడులు ఉంటే కేటగిరీ-బిగా పిలుస్తారు. వీటిని హైరిస్క్ ఉన్న హైగ్రోత్ పథకాలుగా పిలుస్తారు. ఇక 35 నుంచి 60 శాతం ఈక్విటీ పెట్టుబడులు ఉన్నవాటిని కేటగిరీ సీగా పరిగణించనుండగా.. వీటిని బ్యాలెన్స్‌డ్ రిస్క్‌గా చెబుతారు. అలాగే 10 నుంచి 35 శాతం ఈక్విటీ పెట్టుబడులు ఉంటే కేటగిరీ డీలో ఉంటాయి. వీటిని తక్కువ రిస్క్ ఉన్నవాటిగా పరిగణిస్తారు. ఇక 0 నుంచి 10 శాతం వరకు ఈక్విటీ పెట్టుబడులు ఉన్నవాటిని కేటగిరీ ఈలో చేరుస్తారు. వీటిని రుణ ఆధారిత పథకాలుగా గుర్తిస్తారు.

అయితే ఒక పథం రెండు కేటగిరీల్లో ఉండేలా ఎంచుకోవడానికి వీలుండదు. ఏదో ఒక కేటగిరీలో మాత్రమే ఉండేలా కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇక నుంచి పెట్టుబడిదారులు రిస్క్ చేసే స్వభావాన్ని బట్టి ఏ పథకంలో ఉండాలనేది నిర్ణయించుకోవచ్చు. తమ రిస్క్ స్థాయికి తగ్గట్లు పథకాన్ని ఎంచుకోవచ్చు. పెన్షన్ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర్‌డీఏ ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటికి సంబంధించి ఆగస్ట్ 28వ తేదీన సర్క్యూలర్ జారీ చేసింది. వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని సర్క్యూలర్‌లో స్పష్టంగా పేర్కొంది. ఈ కొత్త వర్గీకరణ వల్ల రిస్క్, రాబడి, ఛార్జీలు స్పష్టంగా కనిపించనున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పథకంగా చెప్పవచ్చు. ఇది ఒక స్వచ్ఛంద, దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు పథకంగా పిలుస్తారు. ఇందులో స్వచ్చంధంగా ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. 18 నుంచి 85 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఇందులో చేరవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us