Sovereign Gold Bonds: రేపటి నుంచి అమ్మకానికి గోల్డ్ బాండ్స్.. అలా కొనేవారికి డిస్కౌంట్ ప్రకటించిన RBI..

Gold Bonds: సోమవారం నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (SGB) 2021-22 తదుపరి విడత ఇష్యూ గ్రాము బంగారం ధర రూ. 5,109 గా ఉండనుందని రిజర్వు బ్యాంక్(Reserve Bank) వెల్లడించింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 - సిరీస్ X, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు అందుబాటులో ఉంటుంది.

Sovereign Gold Bonds: రేపటి నుంచి అమ్మకానికి గోల్డ్ బాండ్స్.. అలా కొనేవారికి డిస్కౌంట్ ప్రకటించిన RBI..
Gold Bonds

Updated on: Feb 27, 2022 | 9:46 AM

Gold Bonds: సోమవారం నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (SGB) 2021-22 తదుపరి విడత ఇష్యూ గ్రాము బంగారం ధర రూ. 5,109 గా ఉండనుందని రిజర్వు బ్యాంక్(Reserve Bank) వెల్లడించింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 – సిరీస్ X, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు ఐదు రోజుల పాటు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. బాండ్ నామమాత్రపు విలువ రూ. 5,109గా ఉండనుందని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం అనేది మెరుగైన ఎంపిక. “సావరిన్ గోల్డ్ బాండ్ ట్రాంచ్-10 ధర 5109/gm వద్ద నిర్ణయించబడింది. ఫిజికల్ గోల్డ్ నుంచి డిజిటల్/పేపర్ గోల్డ్‌కు పెట్టుబడిని తరలించడం అనేది SGB ద్వారా ప్రభుత్వానికి పెద్ద విజయాన్ని అందించింది. దీనిలో 2015లో ప్రారంభించినప్పటి నుంచి రూ. 32,000 కోట్లకు పైగా సమీకరించింది. పేపర్ గోల్డ్‌లో (SGBలు) పెట్టుబడి పెట్టడం మంచి, తక్కువ పనితో కూడుకున్న ఎంపిక. దీనికి స్టోరేజీ ఖర్చు ఉండదు. కానీ.. బంగారు ఆభరణాల విషయంలో మేకింగ్ ఛార్జీలు ఉంటాయని ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయిన మిల్‌వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, సీఈవో నిష్ భట్ తెలిపారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే రాయితీ..

భారత ప్రభుత్వం RBIతో సంప్రదించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే పెట్టుబడిదారులకు గ్రాముకు రూ. 50 వరకు తగ్గింపును అందించాలని నిర్ణయించింది. దీనికోసం సదరు పెట్టుబడిదారుడు చెల్లింపు డిజిటల్ రూపంలో చేయవలసి ఉంటుంది. ఇటువంటి పెట్టుబడిదారుల కోసం, గోల్డ్ బాండ్ యొక్క ఇష్యూ ధర గ్రాము బంగారంపై రూ. 5,059 ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. బాండ్‌లు ఒక్క గ్రాము నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో గరిష్ఠ పెట్టుబడికాలం 8 సంవత్సరాలు ఉండగా.. పెట్టుబడి దారులు 5 సంవత్సరాల తరువాత తమ బాండ్లను విక్రయించుకోవటానికి వెసులుబాటు ఉంటుంది.

అంతర్జాతీయ, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు ఏడాది కంటే ఎక్కువ కాలం పెరిగాయి. చారిత్రాత్మకంగా బంగారం దాని సురక్షిత పెట్టుబడి లక్షణం కారణంగా అనిశ్చితి సమయంలో పెట్టుబడిదారులను ఆకర్షించింది. “ఉక్రెయిన్‌లో పరిస్థితి ముడిచమురు ధరల పెరుగుదలకు దారితీసింది. చమురు ధరల ర్యాలీ రూపాయి మారకపు విలువపై ఒత్తిడి తెచ్చింది. తద్వారా బంగారం మరింత ఖరీదైనది. ప్రస్తుతం, బంగారం అంతర్జాతీయ మరియు స్థానిక పరిణామాలకు మద్దతు ఇస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌లో అభివృద్ధి, ఫెడ్ చర్య చాలా ఆస్తి తరగతులకు దిశానిర్దేశం చేస్తుంది. కానీ భారతదేశంలో అధిక ముడి చమురు ధర, ద్రవ్యోల్బణం, రూపాయి మరకపు విలువపై తదుపరి ఒత్తిడి స్వల్ప, మధ్యస్థ కాలంలో బంగారం ధరలకు మద్దతునిస్తోంది.

SGB: కనిష్ట మరియు గరిష్ఠ పరిమితి

SGB కింద అనుమతించదగిన కనీస పెట్టుబడి 1 గ్రాము బంగారం. సబ్‌స్క్రిప్షన్ గరిష్ఠ పరిమితి వ్యక్తులకు 4 కిలోలు, HUFలకు 4 కిలోలు, ట్రస్టులు లేదా అటువంటి సంస్థలకు ఆర్థిక సంవత్సరానికి 20 కిలోలుగా నిర్ణయించటం జరిగింది.

Also read..

Banking News: ఆ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు భారీగా పెంపు..

Health Tips: రాత్రిపూట భోజనం మానేస్తున్నారా? అయితే ఈ అనర్థాలు తప్పవు..

Loading...
Unable to load recommendations.
Follow Us