Luxurious House: లగ్జరీ ఇల్లు కొన్న నారాయణమూర్తి.. ధర ఎంతో తెలిస్తే షాక్‌.. అక్కడే విజయ్‌ మల్యా

Luxury House: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇల్లు కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్‌లో రెండేళ్ల క్రితం కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ కుమారుడు రానా జార్జ్ రూ.35 కోట్ల విలువైన ఫ్లాట్‌ను..

Luxurious House: లగ్జరీ ఇల్లు కొన్న నారాయణమూర్తి.. ధర ఎంతో తెలిస్తే షాక్‌.. అక్కడే విజయ్‌ మల్యా

Updated on: Dec 07, 2024 | 6:07 PM

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. నివేదిక ప్రకారం ఈ ఇంటి ధర అక్షరాల రూ.50 కోట్లు. నారాయణ మూర్తి బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్‌లోని 16వ అంతస్తులో 4 బెడ్‌రూమ్‌లు, 5 కార్ పార్కింగ్ ఉన్న ఇంటిని కొనుగోలు చేశారు. ఇక్కడ విజయ్ మాల్యాతో సంబంధం ఉంది. నారాయణమూర్తి ఇప్పుడు ఇల్లు తీసుకున్న చోట గతంలో విజయ్ మాల్యా కూడా అక్కడే ఉండేవారు.

నారాయణమూర్తి ఇల్లు కొన్న టవర్‌లో ఆయన భార్య సుధా మూర్తి కూడా నాలుగేళ్ల క్రితం ఇదే టవర్‌లోని 23వ అంతస్తులో రూ.29 కోట్లతో ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఈ ఇల్లు 8400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అలాగే చదరపు అడుగు ధర రూ.59,500. మూర్తి ఈ ఇంటిని ముంబై వ్యాపారవేత్త నుండి కొనుగోలు చేశారు.

విజయ్ మాల్యా ఇల్లు కూడా ఇక్కడే..

నారాయణమూర్తి ఇల్లు కొన్న టవర్‌లో విజయ్ మాల్యాకు కూడా అంతకుముందు అక్కడ ఇల్లు ఉంది. 2010 సంవత్సరంలో మాల్యా, ప్రెస్టీజ్ గ్రూప్ మధ్య ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అప్పట్లో అపార్ట్‌మెంట్లు చదరపు అడుగుకు రూ.22 వేలకు విక్రయించగా ఇప్పుడు వాటి ధరలు రెండింతలు పెరిగాయి. ఈ అపార్ట్‌మెంట్ దాదాపు 4.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 81 ప్రత్యేక అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఈ కింగ్‌ఫిషర్ టవర్ 34 అంతస్తులు.

ఈ వ్యక్తులు బెంగళూరులో కూడా ఇళ్లు కొనుగోలు:

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇల్లు కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్‌లో రెండేళ్ల క్రితం కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ కుమారుడు రానా జార్జ్ రూ.35 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. క్వెస్ట్ గ్లోబల్ చైర్మన్ అజిత్ ప్రభు హెబ్బాల్ సమీపంలోని ఎంబసీ వన్‌లో 16 వేల చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను చదరపు అడుగుకు దాదాపు రూ.31 వేల చొప్పున కొనుగోలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరుకు చెందిన Quess Corp ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ ఐజాక్, IT రాజధానిలోని బిలియనీర్ల వీధి అయిన కోరమంగళ ప్రాంతంలో రూ. 67.5 కోట్ల విలువైన 10,000 చదరపు అడుగుల ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ డీల్ చదరపు అడుగు ధర చదరపు అడుగుకు రూ. 70,300. ఇది బెంగళూరులో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన డీల్‌గా మారిందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Digital Ration Card: డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us