ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. మార్చి 31న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఓపెన్ ఉంటుందా?
2025-26 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. మహావీర్ జయంతి సెలవు ఉన్నా, పన్ను కార్యాలయాలు తెరిచే ఉంటాయి. ముందస్తు పన్ను, పెట్టుబడులు, నోటీసులకు స్పందించడం వంటి అన్ని పనులను ఈ గడువులోగా పూర్తి చేయాలి. 2026 ఏప్రిల్ 1 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి వస్తుంది.

మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా సెలవు ఉన్నప్పటికీ, అదే రోజు 2025-26 ఆర్థిక సంవత్సరానికి చివరి రోజు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను కార్యాలయాలను తెరిచి ఉంచాలని నిర్ణయించింది. అత్యవసర పన్ను సంబంధిత పనులు ఉన్న పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మార్చి 31 నాటికి అన్ని పెండింగ్ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ముందస్తు పన్ను చెల్లింపులు, పన్ను ఆదా పెట్టుబడులు, నోటీసులకు స్పందించడం వంటి అంశాలు ఈ గడువులో పూర్తి చేయాలి. ప్రతి ఏడాది లాగానే, ఈసారి కూడా చివరి రోజు అత్యంత రద్దీగా ఉండనుంది. శాఖ స్థాయిలో డేటా సయోధ్య, ఖాతాల ధృవీకరణ వంటి ప్రక్రియలు కూడా ఇదే రోజుతో ముగుస్తాయి.
2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది. పాత నిబంధనలను భర్తీ చేస్తూ, పన్నుల వ్యవస్థను మరింత సరళంగా, పారదర్శకంగా మార్చడం దీని లక్ష్యం. కొత్త విధానాలతో ఫారమ్లు, ప్రక్రియల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్పై ఎస్టిటి పెంపు, షేర్ బైబ్యాక్ పన్ను విధానంలో మార్పులు, మ్యాట్ రేటును 14 శాతానికి తగ్గించడం, టిసిఎస్ రేట్ల సవరణ వంటి నిర్ణయాలు ముఖ్యంగా నిలిచాయి.
మార్చి 31తో పాత ఆర్థిక సంవత్సరం ముగియడం మాత్రమే కాదు, కొత్త పన్ను వ్యవస్థకు కూడా నాంది పలుకుతుంది. అందువల్ల ఎలాంటి బకాయిలు లేకుండా అన్ని పన్ను సంబంధిత పనులను గడువులోగా పూర్తి చేయడం అవసరం. ఆలస్యం చేస్తే కొత్త నిబంధనల ప్రకారం ప్రక్రియలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
