Maldives UPI: మాల్దీవుల్లో యూపీఐ సేవలు.. ప్రకటించిన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు

|

Oct 22, 2024 | 2:58 PM

భారత్‌ యూపీఐ సేవలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఈ యూపీఐ సేవలు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అమలు చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వివిధ దేశాలతో సంప్రదింపులు జరిపి అక్కడి భారతీయులకు లావాదేవీలు మరింత మెరుగ్గా ఉండేందుకు యూపీఐ సేవలు ప్రారంభిస్తోంది. తాజాగా మల్దీవ్‌ దేశంలో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి..

Maldives UPI: మాల్దీవుల్లో యూపీఐ సేవలు.. ప్రకటించిన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు
Follow us on

నిన్నమొన్నటివరకు భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన మాల్దీవ్స్ ఇప్పుడు ఉన్నట్లుండి భారత్‌కు దగ్గరయ్యేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్)ని తమ దేశంలో కూడా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ప్రకటించారు. ఈ మేరకు అక్టోబర్‌ 20న మాల్దీవుల క్యాబినెట్ సిఫార్సు మేరకు ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జూ తమ దేశంలో యూపీఐ పేమెంట్స్ వ్యవస్థను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. మాల్దీవుల అధ్యక్షుడు తమ దేశంలో యూపీఐ సేవలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. భారతదేశం తమ డిజిటల్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్టీస్‌ను పంచుకున్న తర్వాత మాల్దీవ్స్ ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సిఫార్సు మేరకు అధ్యక్షుడు ఈ యూపీఐ సేవలు ప్రారంభించే ప్రతిపాదనకు ఆదివారం ఆమోదం తెలిపారు.

ఆర్థిక అభివృద్ధి, వాణిజ్య మంత్రి ప్రతిపాదించిన నివేదికపై చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికోసం బ్యాంకులు, టెలికం సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ఫిన్‌టెక్ సంస్థలతో కూడిన ఓ కన్సార్టియంను ఏర్పాటు చేయాలని కూడా అధ్యక్షుడు ప్రతిపాదించారు. ఈ నిర్ణయం ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించడం, లావాదేవీల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేస్తుంది. ఈ నిర్ణయానికి వచ్చే ముందు ఆర్థికాభివృద్ధి, వాణిజ్య మంత్రి నుండి వచ్చిన ప్రతిపాదనను కేబినెట్ క్షుణ్ణంగా సమీక్షించిందని రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. UPI అమలును సులభతరం చేయడానికి, ముయిజు ప్రభుత్వం దేశంలో పనిచేస్తున్న బ్యాంకులు, టెలికాం కంపెనీలు, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు, ఫిన్‌టెక్ సంస్థలతో కూడిన ఒక కన్సార్టియంను ఏర్పాటు చేస్తుంది.

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్:

యూపీఐ, ఆధార్, మాడ్యులర్ ఓపెన్ సోర్స్ ఐడెంటిటీ ప్లాట్‌ఫారమ్ (MOSIP), DigiLocker వంటి డిజిటల్ ఆఫర్‌లతో సహా దేశంలో అభివృద్ధి చేసిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) కోసం భారతదేశం ఇతర దేశాలలో మరింత డిజిటల్ టెక్నాలజీ, ఇండియా స్టాక్ వంటి పర్యావరణ-కేంద్రీకృత డిజిటల్ కార్యక్రమాలలో సహకారాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు భారతదేశ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన ఒక నెల లోపే ఈ ప్రకటన వచ్చింది. అక్కడ వారు ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ముయిజు అధికారిక పర్యటన సందర్భంగా డిజిటల్, ఆర్థిక సేవల అమలుపై , యూపీఐ, ప్రత్యేక డిజిటల్ గుర్తింపు, గతి శక్తి పథకం, ఇతర డిజిటల్ సేవలు ప్రారంభించడం ద్వారా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) డొమైన్‌లో సహకరించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

భారత్-మాల్దీవుల సహకారం

ఈ నెల ప్రారంభంలో మాల్దీవుల అధ్యక్షుడు ద్వైపాక్షిక కరెన్సీ మార్పిడి ఒప్పందంగా USD 400 మిలియన్లు, ఐఎన్‌ఆర్‌ 30 బిలియన్ల రూపంలో మద్దతునిచ్చేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రశంసించారు. ఇది ప్రస్తుతం మాల్దీవులు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో కీలకమైనది. మొహమ్మద్ ముయిజు భారత పర్యటన సందర్భంగా మాల్దీవుల ఆర్థిక సవాళ్లను పరిష్కరించడంలో ఇరుపక్షాలు అంగీకరించాయి. ద్వైపాక్షిక సంబంధాన్ని సమగ్రంగా ఆర్థిక అంశాలను భాగస్వామ్యంగా మార్చే లక్ష్యంతో సహకారం కోసం కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి ఇరుపక్షాలకు ఇది సరైన సమయం అని నాయకులు అంగీకరించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి