
సాధారణంగా ప్రజలు ఒకరికి డబ్బు అప్పుగా ఇచ్చినప్పుడు, తిరిగి చెల్లించని పక్షంలో చెక్ బౌన్స్ కేసు వేయవచ్చనే ఉద్దేశంతో ఒక ఖాళీ చెక్కును తీసుకుంటారు. అయితే, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ముఖ్యమైన తీర్పు నగదు అప్పులకు సంబంధించిన నిబంధనలను స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారం, అప్పు ఇచ్చేటప్పుడు కొన్ని కీలక విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక సందర్భంలో, ఒక వ్యక్తి మరొకరికి పది లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చి, తిరిగి చెల్లించకపోవడంతో చెక్ బౌన్స్ కేసు వేశారు. అయితే, కోర్టు అప్పు తీసుకున్న వ్యక్తిని కాకుండా అప్పు ఇచ్చిన వ్యక్తిని పలు ప్రశ్నలు అడిగింది. అంత పెద్ద మొత్తాన్ని ఎలా ఇచ్చారు? అని అడిగినప్పుడు, అతను నగదు రూపంలో ఇచ్చానని బదులిచ్చాడు. అప్పుడు కోర్టు, ఆ నగదుకు ఆదాయ వనరు ఏమిటి, దానికి పన్ను చెల్లిస్తున్నారా లేదా అని అడిగింది. ఈ రెండు ప్రశ్నలకు అప్పు ఇచ్చిన వ్యక్తి సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడంతో, కోర్టు ఆ కేసును కొట్టివేసింది.
ఈ తీర్పు ద్వారా మీకు అర్ధమైంది ఏంటంటే, ఎవరికైనా రూ. 20,000 కన్నా ఎక్కువ మొత్తాన్ని అప్పుగా ఇచ్చినప్పుడు, ఆ మొత్తానికి సంబంధించిన ఆదాయ వనరును కోర్టుకు తప్పనిసరిగా వివరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఆ ఆదాయంపై పన్ను చెల్లిస్తున్నారా లేదా అనే రుజువులను కూడా సమర్పించాలి. అందువల్ల, ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చే ముందు ఈ చట్టపరమైన నిబంధనలను గుర్తుంచుకోవడం, అనవసరమైన చిక్కులను నివారించడానికి సాధారణంగా డబ్బులు అప్పు ఇవ్వడం మానుకోవాలి.