AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు రీఫండ్‌ కేవలం గంటలోనే..

IRCTC New Rule for Refund: రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది ఐఆర్‌సీటీసీ. చాలా మంది రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా ఐఆర్‌సీటీసీలో టికెట్స్‌ బుకింగ్‌ చేసుకుంటారు. అయితే కొన్ని సమయాల్లో టికెట్స్‌ రద్దు చేసుకోవడం, లేదా కన్ఫర్మ్‌ కాకపోవడం వంటివి జరుగుతుంటాయి. అప్పుడు రీఫండ్‌ రావాలంటే కొంత సమయం పట్టేది. అంటే కనీసం రెండు, మూడు రోజుల సమయం పట్టేది. కొన్ని సమయాల్లో ఎక్కువ రోజులు..

IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు రీఫండ్‌ కేవలం గంటలోనే..
Irctc
Subhash Goud
|

Updated on: Mar 13, 2024 | 7:39 PM

Share

IRCTC New Rule for Refund: రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది ఐఆర్‌సీటీసీ. చాలా మంది రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా ఐఆర్‌సీటీసీలో టికెట్స్‌ బుకింగ్‌ చేసుకుంటారు. అయితే కొన్ని సమయాల్లో టికెట్స్‌ రద్దు చేసుకోవడం, లేదా కన్ఫర్మ్‌ కాకపోవడం వంటివి జరుగుతుంటాయి. అప్పుడు రీఫండ్‌ రావాలంటే కొంత సమయం పట్టేది. అంటే కనీసం రెండు, మూడు రోజుల సమయం పట్టేది. కొన్ని సమయాల్లో ఎక్కువ రోజులు కూడా పడుతుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది ఐఆర్‌సీటీసీ. దీంతో ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది.

ఇప్పుడు మీరు మీ టిక్కెట్ రీఫండ్ డబ్బును కేవలం 1 గంటలోనే తిరిగి పొందవచ్చు. వాస్తవానికి వాపసు సేవను వేగవంతం చేయడానికి ఐఆర్‌సీటీసీ సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో కలిసి పని చేస్తోంది. త్వరలోనే ఈ సర్వీస్‌ను ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రస్తుతం ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది..

ఇవి కూడా చదవండి

మీరు ఈ సేవ ద్వారా మీ టిక్కెట్‌ను రద్దు చేసినట్లయితే మీరు టిక్కెట్‌ను బుక్ చేసుకోకుండా కూడా మీ డబ్బు కట్‌ అవుతుంటుంది. రెండు సందర్భాల్లో మీరు సుమారు 1 గంటలోపు మీ వాపసు పొందుతారు. ప్రస్తుతం రీఫండ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. దీని కారణంగా ఐఆర్‌సీటీసీ నుండి మీ రీఫండ్ డబ్బు రావడానికి 2-3 రోజులు పడుతుంది. ముందుగా ఐఆర్‌సీటీసీ మీ బ్యాంక్‌కి రీఫండ్ డబ్బును పంపుతుంది. ఆపై బ్యాంక్ దానిని మీ ఖాతాకు బదిలీ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు సమయం పడుతుంది. ఇప్పుడు ఈ కష్టానికి తెరపడనుంది. మింట్ నివేదిక ప్రకారం.. సర్వీస్ రైల్వే అథారిటీ ఈ వ్యవస్థను మార్చే పనిలో ఉంది. ఐఆర్‌సీటీసీ, సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బృందం ఈ సేవను మెరుగుపరుస్తుంది.

రీఫండ్‌ నియమాలు ఏమిటి?

ప్రస్తుత రైల్వే నిబంధనల ప్రకారం.. మీ టికెట్ వెయిటింగ్‌లో ఉండి అది కన్ఫర్మ్ కాకపోతే మీకు ఆటోమేటిక్‌గా రీఫండ్ డబ్బు వస్తుంది. అదే సమయంలో రైల్వే ధృవీకరించబడిన టిక్కెట్‌ను రద్దు చేస్తే రద్దు ఛార్జీని వసూలు చేస్తుంది. ఇది మీ టికెట్ తరగతిపై ఆధారపడి ఉంటుంది. అయితే మీ రైలు వెళ్లిపోయి, మీరు ప్రయాణించకపోతే అటువంటి పరిస్థితిలో మీరు వాపసు కోసం టీడీఆర్‌ని ఫైల్ చేయాలి. టీడీఆర్‌ ఫైల్ చేసిన తర్వాత దానిని ధృవీకరించిన తర్వాత రైల్వే శాఖ వాపసును జారీ చేస్తుంది. మీరు రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు టిక్కెట్‌ను రద్దు చేయకపోయినా లేదా టీడీఆర్‌ ఫైల్ చేయకపోయినా మీకు తిరిగి చెల్లించరు.

30 నిమిషాల నియమం..

మీరు ఐఆర్‌సీటీసీ నుండి రీఫండ్ కావాలనుకుంటే మీరు రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు టిక్కెట్‌ను రద్దు చేసి టీడీఆర్‌ ఫైల్ చేయాలి. మీరు దీన్ని చేయకపోతే మీరు వాపసు పొందలేరు. ఇప్పుడు ఈ కొత్త సర్వీస్ అమల్లోకి వస్తే లక్షలాది మంది తమ ఖాతాల్లోకి వీలైనంత త్వరగా డబ్బులు చేరే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి