AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: వారెవ్వా.. రోజుకు రూ.70తో చేతికి 7లక్షలు.. పిల్లల భవిష్యత్ కోసం పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్

పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలా మంది ఈ పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పిల్లల విద్య, భవిష్యత్తకు సంబంధించి పోస్టాఫీస్‌లో ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీకు అవసరమైన సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది.

Post Office: వారెవ్వా.. రోజుకు రూ.70తో చేతికి 7లక్షలు.. పిల్లల భవిష్యత్ కోసం పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్
Post Office PPF Scheme
Krishna S
|

Updated on: Aug 29, 2025 | 7:34 AM

Share

ప్రస్తుత కాలంలో పిల్లల చదువు ఖర్చులు తల్లిదండ్రులకు భారంగా మారాయి. విద్య కోసం లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పేదవాడి జీవితంలో ఉన్న డబ్బంతా విద్య, వైద్యానికే అవుతున్నాయి. అయితే ఈ భారాన్ని తగ్గించుకోవడానికి ముందుగానే సరైన పొదుపు ప్రణాళికను రూపొందించుకోవడం చాలా అవసరం. ఇందుకు పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం ఒక అద్భుతమైన ఎంపిక. ఈ పథకంలో చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా పిల్లల ఉన్నత విద్యకు అవసరమైన పెద్ద మొత్తాన్ని సులభంగా సమకూర్చుకోవచ్చు.

చిన్న పొదుపులు.. పెద్ద నిధి

పోస్టాఫీసు పీపీఎఫ్ పథకం దీర్ఘకాలిక పెట్టుబడికి చాలా సురక్షితమైన, నమ్మకమైన మార్గం. ఇందులో ప్రతి సంవత్సరం కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం గడువు 15 ఏళ్లు. అంటే మీరు 15 సంవత్సరాలు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి పెద్ద మొత్తం వస్తుంది. ప్రస్తుతం ఈ పథకంపై సంవత్సరానికి 7.1% వడ్డీ లభిస్తుంది, ఇది పూర్తిగా పన్ను రహితం. ఈ కారణంగా ఈ పథకం ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

రోజుకు రూ.70తో రూ.6.78 లక్షలు

మీరు రోజూ కేవలం రూ.70 ఆదా చేస్తే, నెలలో సుమారు రూ.2,100 అవుతుంది. ఏడాదికి ఇది రూ.25,200 అవుతుంది. ఇలా 15 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మీరు మొత్తం దాదాపు రూ.3.75 లక్షలు డిపాజిట్ చేసినట్లు అవుతుంది. దీనిపై 7.1% వడ్డీతో కలిపి.. మెచ్యూరిటీ తర్వాత మీకు సుమారు రూ.6.78 లక్షలు లభిస్తుంది. పిల్లలు టెన్త్ లేదా ఇంటర్ తర్వాత ఉన్నత చదువుల కోసం పెద్ద కాలేజీలో చేరాలనుకున్నప్పుడు, ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఆ సమయంలో ఈ మొత్తం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

రిస్క్ లేని పెట్టుబడి

పీపీఎఫ్ అనేది ప్రభుత్వం నిర్వహించే పథకం. కాబట్టి ఇందులో పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితం. దీనిపై మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదు. అంతేకాకుండా ఈ పథకంలో వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం రెండూ కూడా ఆదాయపు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు పొందుతాయి. ఈ విధంగా పొదుపుతో పాటు పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

ఈ పథకం ఎందుకు మంచి ఎంపిక?

నిర్ణీత నిధి: పిల్లల చదువుల కోసం అవసరమైన మొత్తం నిర్ణీత సమయానికి సిద్ధంగా ఉంటుంది.

స్థిర వడ్డీ: వడ్డీ రేటు స్థిరంగా ఉండటం వల్ల భవిష్యత్తులో ఎంత మొత్తం వస్తుందో అంచనా వేయడం సులభం.

సురక్షితం: ప్రభుత్వ హామీ ఉండడం వల్ల పెట్టుబడికి పూర్తి భద్రత లభిస్తుంది.

పన్ను ప్రయోజనం: ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.

చిన్న పెట్టుబడి: చిన్న మొత్తంలో కూడా దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించుకోవచ్చు.

ఈ పథకం మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పిస్తూ, పిల్లల బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..