చెక్ ఇన్ సర్వీసులకు ఇండిగో రూ. 100 ఛార్జీ

|

Oct 20, 2020 | 9:20 PM

కరోనా నేపధ్యంలో విమానాశ్రయంలో టచ్ పాయింట్లను తగ్గించడానికి విమాన సంస్థలు శ్రీకారం చుట్టాయి.

చెక్ ఇన్ సర్వీసులకు ఇండిగో రూ. 100 ఛార్జీ
Follow us on

కరోనా నేపధ్యంలో విమానాశ్రయంలో టచ్ పాయింట్లను తగ్గించడానికి విమాన సంస్థలు శ్రీకారం చుట్టాయి. చెక్ ఇన్ సర్వీసులు రూ. 100 ఛార్జీని ప్రకటించింది విమానయాన సంస్థ ‘ఇండిగో’. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. కరోనా నేపధ్యంలో విమానాశ్రయంలో టచ్ పాయింట్లను తగ్గించడానికి ప్రయాణీకులకు వెబ్ చెక్ ఇన్ చెయ్యటాన్ని మే నెలలో విమానయాన మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది ఈ నేపధ్యంలో … అక్టోబర్ 17) నుంచి ఇండిగో… విమానాశ్రయ కౌంటర్లలో చెక్ ఇన్ కోసం రూ. 100 ఛార్జీ వసూలు చేస్తోంది. ఇండిగో వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించి, ప్రభుత్వాదేశాల నేపధ్యంలో వెబ్ చెక్ ఇన్ చేసుకోవాల్సిందిగా ప్రయాణీకులను ప్రోత్సహిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. విమానాశ్రయ కౌంటర్లలో చెక్ ఇన్ ఫీజు అక్టోబర్ 17 నుండి చేసే అన్ని బుకింగ్‌లకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

తక్కువ ధర క్యారియర్ అయిన ఇండిగో ఎయిర్ లైన్స్ తన వినియోగదారుల కోసం కాంటాక్ట్‌లెస్, ఇబ్బంది లేని ప్రయాణానుభవం కోసం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక… ‘ఆన్‌లైన్‌’లో చెక్ ఇన్ చేయడం ద్వారా విమానాశ్రయాల్లో దీర్ఘ క్యూలలో వేచి ఉండకుండా ఉండటానికి వెబ్ చెక్ ఇన్ ఫీచర్ వినియోగదారులకు సహాయపడనుంది. షెడ్యూల్ చేసిన ప్రయాణాలకు ఒక గంట ముందు ఎప్పుడైనా వెబ్ చెక్ ఇన్ చేయవచ్చు.